ఫస్ట్ టైమ్ పల్నాడు ప్రాంతం మాచర్లలో తిరుగులేదనుకున్న వైసీపీ టెన్షన్ పడుతుంది. ఇంతకాలం తాము ఏం చేసిన ప్రజలు..తమకే మద్ధతు ఇస్తారనే కాన్ఫిడెన్స్ తో ఉన్న వైసీపీ శ్రేణులని నారా లోకేష్ పాదయాత్ర టెన్షన్ పెట్టింది. పైకి లోకేష్ పాదయాత్ర ప్రభావం వైసీపీ కవర్ చేసుకుంటున్న లోలోపల వైసీపీ నేతలు మాత్రం కంగారు పడుతున్నారు. లోకేష్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ ప్రజల మద్ధతు భారీగా వస్తుంది.
సభలు కూడా భారీగా సక్సెస్ అవుతున్నాయి. లోకేష్ ప్రజలతో బాగా కలిసిపోతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు..అలాగే స్థానికంగా వైసీపీ నేతల అక్రమాలని ఎండగడుతున్నారు. ఈ పరిణామాలు వైసీపీని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. తాజాగా మాచర్ల నియోజకవర్గంలో లోకేష్ మాస్ జాతర చేశారు. ఊహించని విధంగా పాదయాత్రకు మాచర్ల ప్రజల నుంచి మద్ధతు వచ్చింది. బహిరంగ సభలో వేలమంది పాల్గొన్నారు. మాచర్ల అంటే వైసీపీ కంచుకోట కదా..అక్కడ లోకేష్కు పెద్ద మద్ధతు ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ప్రజలు మద్ధతు తెలిపారు.
ఎప్పుడో 1999లో ఇక్కడ టిడిపి గెలిచింది. మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. రెండు దశాబ్దాల నుంచి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా నడుస్తోంది. ఇక అక్కడ ప్రత్యర్ధులని లేకుండా చేసే రాజకీయం ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనివ్వలేదు.
అలాంటి పరిస్తితి నుంచి ఇప్పుడు వైసీపీని టిడిపి ఓడించడానికి రెడీ అయింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇంచార్జ్ గా వచ్చాక సైకిల్ దూకుడు పెరిగింది. ఎన్ని దాడులు జరిగిన, కేసులు పెట్టిన తమ్ముళ్ళు తగ్గట్లేదు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో మాచర్లలో టిడిపి మరో మెట్టు ఎక్కింది. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ మాచర్లలో వైసీపీకి ఓటమి భయం పట్టుకునేలా చేసింది. ఇదే దూకుడుతో టిడిపి ముందుకెళితే మాచర్లలో పసుపు జెండా ఎగరవేయడం ఖాయం.