గత కొన్ని రోజులుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణని ఇంచార్జ్ గా పెట్టి, కోడెల శివరాంని పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చాయి. కోడెల వర్గం కాస్త సీరియస్ గా ఉంది. ఇటు కోడెల శివరాం సైతం అసంతృప్తిగా ఉన్నారు. తమ ఫ్యామిలీని దూరం చేయడానికి చేస్తున్నారని విమర్శలు చేశారు.
సత్తెనపల్లిలో కన్నాకు సహకరించే పరిస్తితి లేదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గురజాల నుంచి సత్తెనపల్లిలో పాదయాత్రతో ఎంట్రీ ఇచ్చిన లోకేష్..విభేదాలు ఉన్న అందరి నేతలని కలిపారు. కన్నా లక్ష్మినారాయణ, కోడెల శివరాం, శివనగమల్లేశ్వరావు…ముగ్గురుని కలుపుకుని లోకేష్ పాదయాత్ర చేశారు. అయితే సత్తెనపల్లిలో టిడిపి విభేదాలని మరింత పెంచి లబ్ది పొందాలని చూస్తున్న వైసీపీకి ఈ అంశం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అలాగే లోకేష్ అందరినీ కలుపుకుని వెళ్ళడంతో అక్కడ తమ్ముళ్ళు అంతా ఐక్యంగా పనిచేయడానికి రెడీ అవుతున్నారు.
అయితే సత్తెనపల్లి సీటు దాదాపు కన్నాకే ఫిక్స్ అవుతుందని చెప్పవచ్చు. దీంతో కోడెల భవిష్యత్ పై ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు..కోడెల భవిష్యత్ చూసుకుంటానని మాట ఇచ్చారు. నెక్స్ట్ టిడిపి అధికారంలోకి వస్తే ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ సత్తెనపల్లిలో టిడిపి గెలుపుకు కోడెల వర్గం పూర్తిగా సహకరిస్తే..అక్కడ అంబటి రాంబాబుకు చెక్ పెట్టవచ్చని మిగతా తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు.
ఇప్పటికే అంబటిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు ఐక్యంగా పనిచేస్తే సత్తెనపల్లిలో సులువుగా గెలుస్తారు. ఇప్పుడు ఆ దిశగానే లోకేష్ అడుగు వేశారు. అందరు నేతలని కలిపారు. ఇలాగే ఐక్యంగా ముందుకెళుతూ సత్తెనపల్లిలో టిడిపి జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి.
ReplyReply allForward |