చేస్తున్న తప్పులని ఎత్తిచూపిస్తే తట్టుకునే పరిస్తితుల్లో వైసీపీ నేతలు ఉండటం లేదనే విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. ఏదైనా చిన్న విమర్శ చేస్తే అసలు వైసీపీ నేతలు ఊరుకోవడం లేదు. వెంటనే మాటల దాడి చేస్తారు. ఇలా గత నాలుగేళ్లుగా వైసీపీ మాటల దాడి చేస్తూనే ఉంది. ప్రభుత్వంలో లోపాలు, ఏమైనా తప్పులని ప్రశ్నిస్తే చంద్రబాబుని ఏ విధంగా బూతులు తిడతారో చెప్పాల్సిన పని లేదు. అలాగే టిడిపి నేతలని ఎలా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేశారో తెలిసినే. కార్యకర్తలపై కేసులు పెట్టడం, వారిపై దాడులు చేయడం కూడా జరిగింది. కొందరు నేతలు జైలుకు కూడా వెళ్లారు.
ఇక టిడిపి మాత్రమే కాదు..జనసేన అధినేత పవన్ పై కూడా ఎలా మాటల దాడి చేస్తారో తెలిసిందే. రాజకీయాలకు సంబంధం లేని వారు ఏదైనా ప్రశ్నించిన ఊరుకోరు. ఆ మధ్య ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడకు వచ్చి..ఎన్టీఆర్, బాబులని పొగిడారు..జగన్ని ఒక్క మాట అనలేదు. కానీ ఆయన్ని వైసీపీ నేతలు ఎలా తిట్టారో తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అంశం వదిలేసి..సినిమాలపై పడతారని ఎందుకని చిరంజీవి ప్రశ్నిస్తే..ఆయన్ని వరుసపెట్టి వైసీపీ నేతలు తిడుతున్నారు. అంటే ప్రశ్నిస్తే తిడతామని అన్నట్లుగా వైసీపీ నేతలు ఉన్నారు. చిన్నపాటి వారైతే..దాడులు చేస్తారు..కేసులు పెడతారు. ఇటీవల పుంగనూరులో చంద్రబాబు, టిడిపి శ్రేణులపై దాడులు చేసి..వారిపైనే తిరిగి కేసులు పెట్టారు.
అబ్బో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అయితే ఇలా చేయడంవల్ల తమదే పై చేయి అని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు ఉన్నారు. కానీ ఈ అంశాలే పెద్ద మైనస్ అవుతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇలా ఎదురుదాడి చేసి వైసీపీ నేతలు..చివరికి జగన్ని ముంచేలా ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.