జగన్ ప్రభుత్వ నిర్ణయాలు.. దళితలు ఉన్నతికి ఊచ కోతలుగా మారాయి. అవలంబిస్తున్న విధానాలు.. అడుగడుగునా వారి అభివృద్ధికి అవరోధాలుగా దాపురించాయి.
నవంబర్ 1, 1956 విశాంధ్రప్రదేశ్ ఏర్పాడినాటి నుంచి 16 మంది ముఖ్యమంత్రులు దళిత ఉన్నతికి పెద్దపీట వేశారు. ఏపీ.., తెలంగాణ విడిపోయిన తరువాత కూడా ఏపీ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దాదాపు 27 పథకాలను రూపకల్పన చేసి ఆయా కులాల వారిని ఆదుకున్నారు చంద్రబాబు. 2019 మే 31 నుంచి ఈ పథకాలన్నీంటికి గండికొట్టారు తరువాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్. ఇందులో భూమి కోనుగోలు పధకం.., స్వయం ఉపాధి రుణాలు.., ఎన్ఎస్ఎఫ్ డీసీ పథకాలు.., విద్యోన్నతి.., ఎస్సీలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ.., కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక గ్రాంటు, జాతీయ ఎస్సీ ఆర్ధికాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు వంటివి పూర్తి మాఫీతో ఇచ్చే పథకాలన్నీంటికీ జగన్ పాతరేశాడు. 1988 నుంచి 2019 వరకు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపాటు ఏపీలో.. నాటి తెలంగాణలో అనేక పథకాలు ఎస్సీ కుటుంబాల్లో వెలుగులు నింపాయి.
పక్క రాష్ట్రమైన తెలంగాణలో దళితులకు పెద్ద పీట వేశారు సీఎం కేసీఆర్. వారి జీవితాల్లో దళిత బంధువు పేరిట వెలుగు దివ్వెలను నింపారు. గరిష్టంగా రూ.10 లక్షలు పూర్తి మాఫీతో రుణమిచ్చి వారిని వ్యాపారవేత్తగా మార్చారు కేసీఆర్. దీంతో దళిత కుటుంబాల పేరిట తెలంగాణ వ్యాప్తంగా కళ్యాణ మండపాలు.., సంచుల తయారీ.., లేడీస్ ఎంపోరియం.., కంప్ర్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వంటి పరిశ్రమల అనేకం వెలిశాయి. ఎస్సీ కటుంబాలకు ఉపాధితోపాటు వారిని లక్షాదికారులను చేశారు సీఎం కేసీఆర్. ఇచ్చే 10 లక్షలను పూర్తి మాఫితో రుణాన్ని అందించడం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. అలానే ఆ రుణంలో 10 వేలు కట్ చేసి.. దానికి ప్రభుత్వం కొంత కలిపి.. కార్పస్ పండ్ ను ఏర్పాటు చేసోంది. దళితులు స్థాపించిన వ్యాపారాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈ నిధి ద్వారా వారికి భరోసా అందుతోంది. ఇలా దళితుల కోసం బృహత్తర పథకాలను తీసుకొచ్చి కేసీఆర్ వారిపాలిట దేవుడయ్యాడు. 2014 – 2022 వరకు ఉన్న 9 ఏళ్ళ కాలంలో 38 వేల 323 ఎస్సీ కుటుంబాలకు 3,832 కోట్ల ఆర్ధిక సాయం నేరుగా అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
పక్క రాష్ట్రంలో దళితులను హక్కున చేర్చుకుని నెత్తిన పెట్టుకుంటే.. జగన్ రెడ్డి మాత్రం పాలేగాళ్ల సంస్కృతిని తెచ్చి.. ఏపీ లో దళితులను అణచివేస్తున్నాడు. పథకాలన్నీంటిని నిర్విర్యం చేసి... 50 ఏళ్ళ క్రితం నాటి పేదరికాన్ని దళితులకు చవిచూసేలా చేశాడు. దళితుల భూములు, రాయితీతో ఇచ్చే రుణాలను సైతం రద్దు చేశాడు. పరిశ్రమల్లో.., వ్యాపారాల్లో.., వ్యవసాయంలో సాయంగా నిలిచే పథకాలన్నీ జగన్ వచ్చిన తరువాత అవి కాలగర్బంలో కలిసిపోయాయి. 2015-2019 మధ్య తెలుగు దేశం ప్రభుత్వ హయంలో ఏపీలో దాదాపు 23 వేల మందికి ఎస్సీఎస్టీలకు 515 కోట్లకు పైగా సూక్ష రుణాల పేరిట అందజేసి ఆదుకుంది. విదేశీ విద్యతో ఇతర దేశాలకు పంపి ఉన్నత విద్యకు పెద్ద పీట వేశాడు చంద్రబాబు.
ఇలా అనేక పథకాలను ఆనాడు ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం.. ఈనాడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ అమలుపరుస్తూ అన్నీ విధాలుగా ఎస్సీలకు ఉన్నతికి తోడ్పటునందించాయి. కానీ జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల ఉన్నతి మాట దేవుడెరుగు.. ఉన్న పథకాలను రద్దు చేసి.., ప్రశ్నించిన వారిని ఊచకోత కోసి పాతాలనికి తొక్కారని దళిత సంఘాలు రోడ్డెక్కి దుమ్మెత్తిపోస్తున్నాయి.