ఇంట్లో కులం.., మతం..! గడప దాటితే అంతా సమానత్వమే..! మతం పేరుతో రాజకీయాలు.., కులం పేరుతో ఓట్లు దండుకోవటం జగన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య. అదే 2019లో కలిసొచ్చింది.
కడపలో గడప దాటిన మతోన్మాదం విద్యార్థులు పాలిట శాపంగా మారింది. మన మతాన్ని మనం ప్రేమించాలి.. ఎదుటి మతాన్ని గౌరవించాలి. ఇదే జాతికి దేశమిచ్చే సందేశం. జాతి ఐక్యత కోసం సామరస్యత, సౌభ్రాతృత్వం వంటి మూల సూత్రాలను నాటి.., నేటి ప్రధానులు.., ముఖ్యమంత్రులు పాటిస్తున్నదే..! దేశంలో భిన్న సంస్కృతులు...,విభిన్న సాంప్రదాయాలు ఉన్న నేపథ్యంలో ఒకరి మతాన్ని మరొకరు ద్వేషించడం .., మతాల మధ్య చిచ్చుపెట్టి వాటి ద్వారా రాజకీయం చేయడం ఆనాటి సంస్కృతి. ఇంకా .., నేడు కూడా అటువంటి నీచ సంస్కృతితో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
కానీ.., ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మతం గడప దాటింది. అది ఓ గవర్నమెంట్ స్కూలుకు పాకింది. అక్కడ విద్యార్థులపై శాపంగా మారింది.దువ్వూరు మండలం బుక్కాయపల్లి ప్రభుత్వ స్కూల్లోని హెచ్ఎం విద్యార్థులకు వింత ఆంక్షాలు షురూ చేశాడు. పూలు.., బొట్లు పెట్టుకోవద్దని.. , అలా పెట్టుకుంటే.., విద్యార్థులను మోకాళ్ళ దండన ఉంటుందని.. పైశాచిక రూల్స్ పెట్టాడు. దేవుణ్ని నమ్ముకుంటే పరీక్షలు బాగా రాయొచ్చు.. మీరందరూ శ్రావణ మాసం అని మరిచిపోయీ.. దేవుడు మార్గంలో నడవాలని స్కూల్ విద్యార్ధులకు హెచ్ఎం హుకూం జారీ చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభంశుభం తెలియని పసి హృదాయలపై ఇష్టంలేని మతాన్ని బలవంతంగా రుద్దడం ఎంతవరకు సబబు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తు న్నారు. ఇదేక్కడ రాజ్యాంగం.., ఇదెక్కడి నిబంధన అని నిలదీస్తున్నారు.
ఇష్టపూర్వకంగా దైవిక సాంప్రదాయలను మార్చుకుంటే మతం మారినట్లు.., అదే ఒక మతాన్ని నూరిపోసి.. ప్రేరేపించి.. మారాలని ఆంక్షలు విధిస్తే దీన్నే మతోన్మాదం అంటారు. నేడు జగన్ రెడ్డి చేస్తోంది కూడా అదే. ముఖ్యమంత్రి అయిన నాలుగునర ఏళ్ళల్లో వందల కొద్ది హిందూ ఆలయాలను ధ్వసం అయ్యాయి. రథాలు మంటల్లో దహనం అయ్యాయి. ఆలయాలోని దేవతామూర్తులకు ముక్కులు..చెవులు చెక్కబడ్డాయి. ఇంతటి ఘాతుకాలన్నీంటినీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని కళ్ళు.., చెవులు ఉన్న వికలాంగుడయ్యాడు. నేటికీ .. ఆయా కేసుల్లో ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు... ఏం..? అంతేకాక పరమ పవిత్రమైన తిరుమల, రుషికొండ, అన్నవరం, శ్రీశైలం, రామతీర్థం, అంతర్వేది వంటి అనేక ఆలయాల్లో నిత్యం ఏదో ఒక అపవిత్రత ఘటనలు చోటు చేసుకుంటునే ఉంటుంది. ఇటువంటి ఘాతుకాలను నిలవరించాలన్నా.., సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నా.., హిందువుల మతిలో నుంచే మార్పు రావాలి..! ఆ మార్పే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న శక్తులను తరిమికొడుతోంది..! నీచ సంస్కృతికి చరమగీతం పాడాలి. అప్పుడే గుడి.., బడి..,గృహం.., రాష్ట్రం.., దేశం.., సమాజం అంతా ఆనంద మార్గంలో.., వారసత్వ ప్రగతి వైపు సాగుతాయి..!