జగన్ కంచుకోట కడపలో సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటివరకు అక్కడ వైసీపీ హవా నడిచింది..నిదానంగా టిడిపి బలపడుతుండటంతో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. అసలు కడప అంటే టిడిపి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. కానీ ఈ సారి వైసీపీకి ఆ సీన్ కనిపించడం లేదు. జిల్లాలో వైసీపీ ఒక్క సీటు ఓడిపోయిన సరే..ఆ పార్టీకి దెబ్బ పడినట్లే.
అయితే కడపలో టిడిపి అనూహ్యంగా పుంజుకుంటుంది. ప్రస్తుతం టిడిపి రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు లాంటి స్థానాల్లో బలం పుంజుకుంది. అటు కమలాపురంలో కూడా రేసులో ఉంది. ఇక వీటిల్లో 2014 ఎన్నికల్లో రాజంపేటలో టిడిపి గెలిచింది. జిల్లాలో టిడిపి గెలిచిన ఏకైక సీటు ఇదే. టిడిపి నుంచి మేడా మల్లిఖార్జున్ రెడ్డి గెలిచారు. అయితే 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచారు.
కానీ ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అలాగే జిల్లా విభజన విషయంలో యాంటీ ఎక్కువగానే ఉంది. అన్నమయ్య జిల్లాకు రాజంపేటని కేంద్రంగా పెట్టకుండా రాయచోటిని పెట్టడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
ఈ తరుణంలోనే మేడా సోదరుడు విజయ్ శేఖర్ రెడ్డి..తాజాగా చంద్రబాబుని కలిశారు. టిడిపిలోకి రావడానికి ఆయన రెడీ అయ్యారు. ఇక సీటు ఇస్తే తన సోదరుడుపై పోటీ చేసి గెలుస్తానని అంటున్నారు. జిల్లా విభజనలో రాజంపేటకు వైసీపీ అన్యాయం చేసిందని, ఇందులో తన సోదరుడు పాత్ర ఉందని అంటున్నారు. అయితే మేడా సోదరుడు టిడిపిలోకి రావడం ప్లస్ అవుతుంది.
కాకపోతే సీటు విషయమే డౌట్. ఎందుకంటే అక్కడ టిడిపి ఇంచార్జ్ గా బత్యాల చెంగలరాయుడు ఉన్నారు. ఆయనే నెక్స్ట్ పోటీకి రెడీ అవుతున్నారు. మరి అలాంతప్పుడు సీటు విషయంలో బాబు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. ఏదేమైనా రాజంపేట ఈ సారి టిడిపి వశం అయ్యేలా ఉంది.