పాలకొల్లు అంటే టిడిపి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి అక్కడి ప్రజలు టిడిపిని ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అక్కడ టిడిపి స్ట్రాంగ్ గా ఉంది..దానికి కారణం నిమ్మల రామానాయుడు. ప్రజా బలం ఉన్న నాయకుడుగా నిమ్మల పాలకొల్లులో సత్తా చాటుతున్నారు. 2014లో గెలిచాక పాలకొల్లుని అభివృద్ధి బాటపట్టించారు.
సామాన్యుడుగా జనంలోనే ఉంటూ…ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అందుకే 2019లో కూడా ఆయనని మళ్ళీ గెలిపించారు. ఈ సారి ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన ప్రజలతోనే ఉన్నారు..ప్రజల్లోనే తిరుగుతున్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైన వెళ్తారు. అందుకే అక్కడి ప్రజలు ఇప్పటికీ నిమ్మల వైపే ఉన్నారు. అయితే ప్రజా బలం ఉన్న నిమ్మలని ఓడించడానికి వైసీపీ అధికార బలాన్ని గట్టిగానే వాడుతుంది. వరుసగా అభ్యర్ధులని మార్చుకుంటూ వస్తుంది. గత ఎన్నికల్లో డాక్టర్ బాబ్జీ పోటీ చేసి ఓడిపోయారు. ఆయన్ని సైడ్ చేసి భీమవరంకు చెందిన కవురు శ్రీనివాస్ని ఇంచార్జ్ గా పెట్టారు.
పాలకొల్లుపై ఆయనకు పెత్తనం ఇవ్వడానికి ఎమ్మెల్సీ ఇచ్చారు..జెడ్పి ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన ఉపయోగం లేదు. వైసీపీని బలోపేతం చేయలేదు. దీంతో నిమ్మలపై మరోక అభ్యర్ధిని రెడీ చేస్తున్నారు. అదే భీమవరం.. వీరవాసరం మండలానికి చెందిన గుడాల గోపీని కన్వీనర్గా నియమిస్తారని తెలుస్తుంది. అయితే గోపి ఇప్పటిదాకా క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన ఆక్వా వ్యాపారి. ఆర్థిక బలం ఉండడం, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి…అందుకే నిమ్మలపై బరిలో దింపాలని చూస్తున్నారు.
అయితే స్థానిక నేతలని పక్కన పెట్టి..వేరే నియోజకవర్గం నుంచి నేతలని తీసుకొచ్చి పెట్టడంపై పాలకొల్లు వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎవరిని తీసుకొచ్చి పెట్టిన పాలకొల్లుని నిమ్మలకు బ్రేకులు వేయడం వైసీపీకి కలే అని చెప్పవచ్చు.