ఎస్సీ రిజర్వ్ సీట్లలో వైసీపీ హవా ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. అలా వైసీపీ పట్టున్న సీట్లలో అమలాపురం అసెంబ్లీ కూడా ఒకటి. ఇక్కడ గతంలో కాంగ్రెస్కు బలం ఉండేది. ఇక ఇప్పుడు వైసీపీ హవా నడుస్తుంది. అయితే మధ్యలో టిడిపి మూడుసార్లు గెలిచింది. 1994, 1999 ఎన్నికల్లో గెలవగా, మళ్ళీ 2014 ఎన్నికల్లో గెలిచింది.
అయితే అమలాపురంలో ఎస్సీ ఓట్లతో పాటు కాపుల ఓట్లు ఎక్కువ. ఈ రెండు వర్గాలే గెలుపోటములని డిసైడ్ చేస్తాయి. ఇక 2009లో ప్రజారాజ్యం కూడా పోటీలో ఉండటంతో ఓట్లు చీలిపోయి టిడిపికి నష్టం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి పినిపే విశ్వరూప్ గెలిచారు. 2014లో టిడిపికి జనసేన మద్ధతు ఇవ్వడంతో…టిడిపి నుంచి అయితాబత్తుల ఆనందరావు గెలిచారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి ఓట్లు చీల్చడంతో వైసీపీ నుంచి విశ్వరూప్ గెలిచారు. ఇక విశ్వరూప్ మంత్రి అయ్యారు. మంత్రిగా ఈయన చేసేది ఏమి లేదు. అలాగే అమలాపురంలో అభివృద్ధి లేదు.
పైగా నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీటు కోసం అమలాపురం ఎంపీ చింతా అనురాధ ట్రై చేస్తున్నారు. దీంతో విశ్వరూప్, అనురాధల మధ ఆధిపత్య పోరు జరుగుతుంది. ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించేలా లేరు. ఈ అంశం టిడిపి-జనసేనలకు కలిసొస్తుంది. కాకపోతే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే ప్లస్.
ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి 72 వేల ఓట్లు వస్తే, టిడిపికి 46 వేలు, జనసేనకు 45 వేల ఓట్లు వచ్చాయి. రెండు పార్టీలు కలిస్తే 91 వేలు. అంటే వైసీపీ కంటే 19 వేలు ఎక్కువ. ఇప్పుడు వైసీపీపై యాంటీ ఎక్కువ ఉంది. దీంతో రెండు పార్టీలు కలిసి ఎవరు పోటీ చేసిన భారీ మెజారిటీతో గెలుస్తారు.