ఒక సిఎం కొడుకు అయి ఉండి ఎన్నికల్లో ఓడిపోయారని, మాట్లాడటం రాదని, పప్పు అని చెప్పి నారా లోకేష్ని వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఎగతాళి చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి తన బాడీ గురించి కూడా దారుణంగా ఎగతాళి చేశారు. అలా ఎగతాళి చేయడం వల్లే అనుకుంటా లోకేష్ లో పట్టుదల పెరిగింది. ఒక ప్రజా నాయకుడుగా క్రమంగా ఎదుగుతూ వచ్చారు.
మొదట బరువు తగ్గడం, మాట తీరు మార్చుకున్నారు. సిఎం జగన్ తడబడుతూ తప్పులు మాట్లాడుతుంటే..లోకేష్ తడబాటు లేకుండా ఎఫెక్టివ్ గా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక పాదయాత్ర ముందు వరకు లోకేష్ వేరు..పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. అసలు ప్రజల్లో పెద్దగా తిరగని లోకేష్ ప్రజలని ఎలా ఆకట్టుకుంటారో అని అంతా అనుకున్నారు. టిడిపి శ్రేణులు కూడా డౌట్ పడ్డాయి. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు, వారి సమస్యలని తెలుసుకోవడం, పరిష్కారానికి మార్గాలు చూపించడం, వైసీపీ వైఫల్యాలని ఎండగట్టడం, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై గళం విప్పడం చేస్తూ వచ్చారు.
ఇక అన్నిటికంటే ముఖ్యమైనది యువతని ఆకట్టుకోవడం.. రాజకీయాల్లో గెలుపోటములని శాసించే బలం యువతకు ఉంది. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త ఓటర్లు వారే. అయితే గత ఎన్నికల్లో యువతకు జాబ్ క్యాలెండర్ అని, ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి జిల్లా..హైదరాబాద్ అవుతుందని జగన్ మాయమాటలు చెప్పి..వారి చేత ఓట్లు వేయించుకుని గెలిచారు. కానీ అధికారంలోకి వచ్చాక అవేం లేవు. పూర్తిగా యువత మోసపోయింది.
దీంతో యువతకు లోకేష్ మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. యువతి, యువకులు లోకేష్ పాదయాత్రలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఇక వారితో ఎప్పటికప్పుడు సెపరేట్ గా సమావేశం అవుతూ..వారి సమస్యలు తెలుసుకుంటున్నారు..వారికి అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. ఇచ్చిన హామీలని నిలబెట్టుకోకపోతే కాలర్ పట్టుకుని నిలదీయాలని కోరుతున్నారు.
అయితే లోకేష్ మాటలు యువతని ఆకట్టుకుంటున్నాయి. దీంతో యువత టిడిపి వైపు చూడటం మొదలుపెట్టారు. మెజారిటీ యువత టిడిపి వైపుకు వస్తే చాలు విజయం ఆటోమేటిక్ గా వస్తుంది.