టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో పర్యటిస్తూ..జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, టిడిపి అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తుందనే అంశాలని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక మండపేటలో బాబు రోడ్ షో, సభ జరిగింది. ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. దీని బట్టి చూస్తే మండపేట టిడిపి కంచుకోట అని మరోసారి రుజువైంది.
ఇక ఈ కంచుకోటని సొంతం చేసుకోవాలని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇదే క్రమంలో టిడిపి నుంచి వచ్చిన తోట త్రిమూర్తులుని వైసీపీలోకి తీసుకుని మండపేట ఇంచార్జ్ గా పెట్టారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో అధికార బలంతో తోట దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ సారి మండపేటని వైసీపీ వశం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికార బలంతో పెత్తనంతో చేసిన మండపేటలో మాత్రం టిడిపి బలం ఏ మాత్రం తగ్గడం లేదు. గత మూడు ఎన్నికల్లో అక్కడ టిడిపిని గెలిపిస్తూనే వచ్చారు.
2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా అక్కడ వేగుళ్ళ జోగేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. ఈసారి నాల్గవ విజయం సాధించే దిశగా వెళుతున్నారు. కానీ వేగుళ్ళ విజయాన్ని అడ్డుకోవడానికి తోట ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అవేమీ వర్కౌట్ అయ్యేలా లేవు. తాజాగా బాబు టూర్ తో మండపేటలో టిడిపి బలం తగ్గలేదని తేలిపోయింది.
పైగా మండపేటలో కమ్మ, బిసి వర్గాలు వేగుళ్కే మద్దతు ఇస్తాయి. అటు తోటపై దళిత వర్గం ముందు నుంచి యాంటీగానే ఉంది. దీని వల్ల వారు వేగుళ్ళకు ప్లస్. ఇక కాపు వర్గం కూడా జనసేన-టిడిపి పొత్తు ఉంటే సగం వేగుళ్ళ వైపుకే వెళ్తారు. దీంతో మండపేటలో వేగుళ్ళ నాల్గవ విజయం సాధించడం ఖాయం.