రాష్ట్రంలో ఏ ప్రాంతమైన..ఈ నియోజకవర్గమైన చంద్రబాబు పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..ఆయన సినిమా యాక్టర్ కాదు..రాజకీయాల్లోకి కొత్తగా రాలేదు..40 ఏళ్ల నుంచి ఆయన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు..అయినా సరే ఆయన పర్యటనల్లో జానా ప్రభంజనం కొనసాగుతుంది. తాజాగా ఆయన కోనసీమలో పర్యటించారు. మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజజకవర్గాల్లో బాబు టూర్ కొనసాగింది. మూడు రోజుల పర్యటన సూపర్ హిట్ అయింది.
రోడ్ షో, బహిరంగ సభలు భారీ స్థాయిలో సక్సెస్ అయ్యాయి. మూడు నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున కనిపించారు. ఇలా కోనసీమలో బాబు టూర్ సూపర్ హిట్ అవ్వడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు..అందులో మొదట జగన్ పై వ్యతిరేకత..ప్రజల పాలనలో ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో తెలిసిందే. దీంతో ప్రజలు జగన్ కంటే బాబు పాలన వెయ్యి రెట్లు బెటర్ అని ఆలోచిస్తున్నారు. అందుకే జగన్కు యాంటీగా ప్రజలు బాబుకు మద్ధతు తెలుపుతున్నారు.
ఇక లోకల్ టిడిపి నాయకులు, శ్రేణులు..సభలని భారీ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆద్యంతం టిడిపి నేతలు బాబు కోనసీమలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేవరకు..ఎక్కడ విశ్రమించకుండా పని చేసి సత్తా చాటారు. దాంతో బాబు టూర్ మరో మెట్టు ఎక్కింది. ఆఖరిగా జనం..బాబు రావాలని కోరుకుంటున్నారు..అదే సమయంలో జనసేనతో పొత్తు.
కోనసీమలో జనసేన ప్రభావం కూడా ఉంది. టిడిపితో పొత్తు దిశగా వెళ్లడంతో..పవన్ని అభిమానించే వారు సైతం బాబుకు మద్ధతు తెలిపారని తెలిసింది. అందుకే అమలాపురం సభలో బాబు..ప్రత్యేకంగా కాపుల ప్రస్తావన తీసుకొచ్చి..వారికి గత టిడిపి ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు. మొత్తానికి చూసుకుంటే బాబుకు కోనసీమ ప్రజలు నీరాజనం పలికారు..ఇక అక్కడ టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ అస్సామే అని తేల్చేశారు.