ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది..గుంటూరు నుంచి ప్రకాశం బ్యారేజ్ ద్వారా విజయవాడ గడ్డపై లోకేష్ అడుగుపెడుతున్నారు. ఆగష్టు 1వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇచ్చింది..దాదాపు 18 రోజుల పాటు పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక చోటని మించి మరొక చోట జన ప్రభంజనం కనిపించింది.
ఆద్యంతం పాదయాత్రలో సాధారణ ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లోకేష్ ఎక్కడకక్కడ ప్రజలని కలుస్తూ..వారి సమస్యలని తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ కదిలారు. అలా వినుకొండ నుంచి మంగళగిరి వరకు విజయవంతంగా లోకేష్ పాదయాత్ర సాగింది. లోకేష్ పాదయాత్ర జరగడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో టిడిపి బలం మరింత పెరిగింది. అలాగే ఎక్కడన్న టిడిపిలో ఉన్న గ్రూపు తగాదాలకు చెక్ పడింది. వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర సక్సెస్ఫుల్గా సాగింది. ఈ పాదయాత్రలో గురజాల, చిలకలూరిపేట, రేపల్లె, బాపట్ల, పొన్నూరు టిడిపి శ్రేణులని సైతం భాగస్వాములుగా చేశారు.
ఓవరాల్ గా గుంటూరులో లోకేష్ పాదయాత్ర అదిరిపోయింది. ఇక పాదయాత్ర ప్రభావంతో టిడిపికి గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. వినుకొండలో టిడిపికి ఆధిక్యం వచ్చింది. మాచర్లలో వైసీపీకి పోటీగా టిడిపి బలపడింది. ఇటు సత్తెనపల్లిలో వర్గ విభేదాలు చక్కదిద్దారు.ఇక్కడ టిడిపి గెలవడమే తరువాయి. పెదకూరపాడుపై పట్టు సాధించారు. ఇక తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో గెలుపు వన్ సైడ్ చేశారు.
ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ కాబోతుంది. అక్కడ ఏ మేర ప్రభావం చూపుతారో చూడాలి.
ReplyReply allForward |