ఎమ్మెల్యేగా టికెట్ రావాలంటే రాజకీయంగా పలుకుబడి ఉండాలి. అంతేకాకుండా ఆర్థికంగా బలమైన నాయకుడై ఉండాలి. కానీ ఇవేవీ లేకుండా అనూహ్యంగా మడకశిర నియోజకవర్గంలో ఒక కొత్త అభ్యర్థిని ఇంచార్జ్ గా నియమించి వైసిపి కొత్త ప్రయోగం చేసిందని చెప్పవచ్చు.
మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు స్థానం. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున తిప్పే స్వామి విజయం సాధించారు. కానీ తిప్పేస్వామి పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. తిప్పే స్వామి వ్యవహార శైలితో విసిగి వేసారిన కీలక నేతలు కొందరు రాజీనామాలకు కూడా సిద్ధపడ్డారని చెప్పవచ్చు. అటువంటి నియోజకవర్గంలో తిప్పేస్వామిని పక్కన పెడతారని కచ్చితంగా ముందు నుంచి అనుకుంటూ ఉన్నారు. కానీ తిప్పే స్వామిని పక్కన పెడితే వైసీపీ తరఫున అభ్యర్థి ఎవరా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈర లక్కప్పను మడకశిర ఇంచార్జిగా నియమించి వైసిపి అధినేత అందరిని ఆశ్చర్యపరిచారని చెప్పవచ్చు. అంగ బలం అర్థబలం ఉన్న నేతలే ఎన్నికల్లో విజయం సాధించడానికి కష్టాలు పడుతూ ఉంటే గ్రామస్థాయిలోనే సరిగా పేరు తెలియని నేతను ఎమ్మెల్యేగా ప్రకటించటం అంటే ప్రయోగమే అని చెప్పవచ్చు. ఈరలకప్పకు తిప్పే స్వామి వ్యతిరేక వర్గం మద్దతుగా ఉందని, అంత తామే చూసుకుంటాం గెలిపిస్తామని చెబుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ తిప్పేస్వామి పై నియోజకవర్గ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అధికార వైసీపీపై కూడా పడే అవకాశం ఉంది. తిప్పేస్వామి చేసిన అవినీతి వలన ఈసారి వైసీపీ తరఫున ఎవరు నిలబడిన గెలుపు కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అదృష్టం కొద్ది టికెట్ సాధించిన ఈర లక్కప్పకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యేగా అవుతారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.