ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే టిడిపి కంచుకోట. అయితే ఆ కంచుకోటలో గత ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడింది. కానీ ఇప్పుడు సత్తా చాటే దిశగా వెళుతుంది. అదే సమయంలో జనసేనతో పొత్తు సెట్ అవుతుంది. దీని వల్ల టిడిపి-జనసేన కలిసి సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయితే రిజర్వడ్ సీట్లలో దాదాపు టిడిపి అభ్యర్ధులే పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకు రిజర్వ్ స్థానాల్లో పట్టు లేదు. ఒక్క కొవ్వూరులో తప్ప మిగిలిన స్థానాల్లో బలం లేదు.
వెస్ట్ లో పోలవరం ఎస్టీ స్థానం కాగా, కొవ్వూరు, చింతలపూడి, గోపాలాపురం ఎస్సీ స్థానాలు. అయితే గత ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఈ నాలుగు సీట్లలో వైసీపీపై వ్యతిరేకత ఉంది. టిడిపి బలపడుతుంది. కానీ టిడిపికి ఉన్న మైనస్ సరైన అభ్యర్ధులు లేకపోవడం. పోలవరం సీటు కోసం మోడియం శ్రీనివాసరావు, బొరగం శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించేలా లేరు.
అటు గోపాలాపురం సీటు మద్దిపాటి వెంకటరాజుకు ఫిక్స్ అయింది..కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సహకరించడం లేదు. ముళ్ళపూడి బాపిరాజు సపోర్ట్ కూడా లేదు. కొవ్వూరు సీటు కోసం మాజీ మంత్రి కేఎస్ జవహర్ ట్రై చేస్తున్నారు. కానీ ఈయనకు సీటు దక్కకుండా మరో వర్గం ప్రయత్నిస్తుంది. చింతలపూడి సీటు కోసం చాలామంది నేతలు రేసులో ఉన్నారు. కానీ ఎవరికి ఫిక్స్ కాలేదు.
అయితే వైసీపీపై మైనస్ ఉన్నా…అభ్యర్ధులు సెట్ కాకపోవడం, గ్రూపు తగాదాలు ఉండటం టిడిపికి మైనస్. ఇవన్నీ సెట్ అయితే ఈ రిజర్వ్ సీట్లు టిడిపి ఖాతాలో పడతాయి.