ఏపీలో ఎన్నికలు ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు..జగన్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చు..లేదా ముందస్తు కైనా రావచ్చు. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదురుకునేలా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే ముందు నుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే జనసేన తో పొత్తు దృష్ట్యా కొన్ని సీట్లలో బాబు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అలాంటి సీట్లలో టిడిపిలో కాస్త కన్ఫ్యూజన్ నడుస్తుంది.
అలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, చీరాల సీట్లలో క్లారిటీ లేదు. ప్రకాశంలో దాదాపు అన్నీ సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అనే చెప్పాలి. కానీ ఆ రెండు సీట్లే డౌట్. పైగా రెండు సీట్లు టిడిపి బలంగా ఉన్నవి. గత ఎన్నికల్లో చీరాలలో టిడిపి గెలిచింది. టిడిపి నుంచి గెలిచిన కరణం బలరామ్ వైసీపీలోకి జంప్ కొట్టారు. దీంతో యడం బాలాజిని ఇంచార్జ్గా పెట్టారు. ఆయన పార్టీకి దూరమయ్యారు. దీంతో ఎంఎం కొండయ్యని ఇంచార్జ్ పెట్టారు.
అయితే ఆయనకు సీటు ఫిక్స్ చేయడం లేదు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. పైగా ఆమంచి స్వాములు జనసేనలో చేరుతున్నారు. దీంతో ఆ సీటుపై ట్విస్ట్ ఉంది. ఇక దర్శి సీటు..ఇక్కడ పలువురు టిడిపి నేతలు వైసీపీలోకి జంప్ చేసిన..ఇంచార్జ్ గా పమిడి రమేశ్ పార్టీ కోసం గట్టిగా కష్టపడ్డారు. దర్శి మున్సిపాలిటీని గెలిపించారు.
అయినా సరే ఆయనకు సీటుపై క్లారిటీ లేకపోవడంతో..ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. పార్టీకి దూరంగా ఉంటున్నారు. మళ్ళీ ఇంచార్జ్ని పెట్టలేదు. జనసేన కోసమే ఈ సీటులో టిడిపి ఇంచార్జ్ పెట్టలేదని టాక్. చూడాలి మరి చివరికి ఈ రెండు సీట్లు ఎవరికి దక్కుతాయో.