ఏపీలో సామాజికవర్గాల పరంగానే రాజకీయం నడుస్తుంది..అందులో ఎలాంటి డౌట్ లేదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి పార్టీలు రాజకీయం చేస్తాయి. ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గ బలం ఉంటుంది..ఆ వర్గాన్ని ఎలా ఆకట్టుకోవాలనేది పార్టీల టాస్క్. ఇక రాష్ట్రంలో అన్నీ వర్గాల పాటు…ముస్లిం వర్గం పట్టున్న స్థానాలు కొన్ని ఉన్నాయి. ఆ స్థానాల్లో ఇప్పటివరకు టిడిపి పెద్దగా రాణించలేదు. వైసీపీనే సత్తా చాటుతుంది.
ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న స్థానాలు..విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, నెల్లూరు సిటీ, రూరల్, మదనపల్లె, హిందూపురం, కర్నూలు సిటీ, కడప సిటీ..ఈ సీట్లలో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ. ఒక్క హిందూపురంలో తప్ప..మిగిలిన సీట్లలో టిడిపి సత్తా చాటలేకపోతుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవానే నడిచింది. కానీ ఈ సారి సీన్ మారేలా ఉంది. ముస్లిం ఓటర్లు సైతం నిదానంగా టిడిపి వైపు వస్తున్నారు. ఒకవేళ బిజేపితో పొత్తు ఉంటే చెప్పలేం గాని..లేదంటే ముస్లిం నియోజకవర్గాల్లో టిడిపి సత్తా చాటే ఛాన్స్ ఉంది.
ఈ సారి టిడిపికి అవకాశం ఉన్న సీట్లలో విజయవాడ వెస్ట్ ముందు వరుసలో ఉంది. ఇక్కడ టిడిపికి బలం పెరిగింది. అదే సమయంలో జనసేనతో పొత్తు ముఖ్యం..పొత్తు ఉంటే గెలుపు సులువు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. ఇక గుంటూరు ఈస్ట్ లో కూడా పొత్తు ప్రభావం ఉంది. టిడిపి-జనసేన కలిస్తేనే విజయం.
అటు నెల్లూరు సిటీ, రూరల్ లో ఈ సారి టిడిపి…వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమే. మదనపల్లెలో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్. హిందూపురం చెప్పాలసిన పని లేదు. టిడిపి అడ్డా.