తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు..కానీ అదే కమ్మ వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ గెలుస్తూ వస్తుంది. టిడిపి ఎప్పుడు ఒకే కులానికి ప్రాధాన్యత ఇవ్వదు..అన్నీ వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రత్యర్ధులు రాజకీయంగా లబ్ది పొందడానికి టిడిపి అంటే కమ్మ పార్టీ అని ముద్రవేస్తారు. అది వాస్తవం కాదని అనేకసార్లు రుజువైంది.
గత ఎన్నికల్లో కూడా కమ్మ వర్గం ప్రభావం స్థానాల్లో వైసీపీ ఎక్కువ గెలిచింది. అందులో కందుకూరు ఒకటి. అసలు ఇక్కడ కమ్మ వర్గం ప్రభావం ఉన్న టిడిపి గెలిచింది రెండుసార్లే. 1994, 1999 ఎన్నికల్లోనే గెలిచింది. మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. అయితే ఈ సారి గెలవాలనే పట్టుదలతో టిడిపి ఉంది. డానికి తగ్గట్టుగానే టిడిపి శ్రేణులు పనిచేస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు వచ్చారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అక్కడే జరుగుతుంది.
కాకపోతే ఈ సీటు విషయంలోనే క్లారిటీ లేదు. సీటు కోసం నలుగురు రేసులో ఉన్నారు. ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, పోతుల రామారావు, లోక్సభ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్…ఇలా నలుగురు కందుకూరు సీటు కోసమే ట్రై చేస్తున్నారు. తాజాగా నలుగురు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎవరికి వారు లోకేష్తో మాట్లాడారు.
అయితే చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారనేది తేలడం లేదు. కాకపోతే ఎవరికి సీటు ఇచ్చిన అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే కందుకూరులో విజయం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటే..మళ్ళీ కందుకూరు పోవడం ఖాయం. చూడాలి మరి కందుకూరు సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.