అధికార వైసీపీలో ఆధిపత్య పోరు గట్టిగానే జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు ఉంది. ముఖ్యంగా సీట్ల కోసం నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు సిట్టింగు ఎమ్మెల్యేలకు సెగలు తగులుతున్నాయి. అయితే తాజాగా రామచంద్రాపురంలో రగడ లేచింది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్కు చెక్ పెట్టి తన తనయుడు సూర్యప్రకాశ్కు సీటు ఇప్పించుకోవాలని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ట్రై చేస్తున్నారు.
ఈ మేరకు అక్కడ సొంతంగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. వేణుకు యాంటీగా ఉన్నవారు బోస్ వర్గంలో చేరుతున్నారు. దీంతో వేణుకు సెగలు తగులుతున్నాయి. వాస్తవానికి రామచంద్రాపురం బోస్ సొంత సీటు..గతంలో కాంగ్రెస్ లో మూడుసార్లు గెలిచారు. తర్వాత కాంగ్రెస్ వదిలి వైసీపీలోకి వచ్చి 2012 ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఓడిపోయారు. 2019లో వేణుకు ఛాన్స్ ఇచ్చి..తాను మండపేటలో పోటీ చేసి ఓడిపోయారు. ఇటు వేణు గెలిచారు. కానీ జగన్..బోస్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. కాకపోతే మండలి రద్దు నెపంతో పదవులకు రాజీనామా చేయించి..రాజ్యసభ ఇచ్చారు. అటు మండపేట బాధ్యతలు టిడిపి నుంచి వచ్చిన తోట త్రిమూర్తులుకు ఇచ్చారు.
దీంతో బోస్ ఏ సీటు ఖాళీ లేదు. కానీ మళ్ళీ తన సొంత సీటు రామచంద్రాపురం దక్కించుకుని..తన వారసుడుని పోటీకి దింపాలని చూస్తున్నారు. అయితే సీటు వేణుకే దక్కే ఛాన్స్ ఉంది. అదే జరిగితే బోస్ సహకరించరు. అటు తోట వర్గం కూడా రామచంద్రాపురంలో వేణుకు సహకరించే ఛాన్స్ లేదు.
ఈ క్రమంలో టిడిపి-జనసేన పొత్తులో పోటీ చెస్ట్ వేణుకు చెక్ పడిపోవడం ఖాయం. కాబట్టి ఎటు వచ్చిన మంత్రి వేణుకే రిస్క్ ఉంది.
ReplyReply allForward |