అధికారం అనేది శాశ్వతం కాదనే విషయం వైసీపీ నేతలు మర్చిపోతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని శాశ్వతంగా తమదే అధికారం అని భావిస్తున్నారు. ఇక జగన్ శాశ్వత సిఎంగా ఉంటారని, తమకే అధికారం ఉంటుందని భావిస్తూ..ప్రతిపక్ష నేతలని ఇష్టారాజ్యంగా తిడుతున్నారు. కానీ అధికారమే అనేది శాశ్వతం కాదని, పదవులు ఉన్నా సరే ప్రజలకు సేవ చేయకుండా..జగన్కు భజన లేదా చంద్రబాబు, పవన్లని తిట్టడానికే పనిచేస్తున్న వారిని ఆ ప్రజలే ఓడించేలా ఉన్నారు.
ఆ లిస్ట్ లో మొదట మంత్రి రోజా ఉన్నారు. గతంలో ఈమె టిడిపిలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.తర్వాత వైసీపీలోకి వచ్చారు. 2014లో నగరిలో అదృష్టం కొద్ది వెయ్యి లోపు ఓట్లతో గెలిచారు. 2019లో వైసీపీ వేవ్ ఉన్నా సరే…మళ్ళీ లక్కీగా స్వల్ప మెజారిటీతో రోజా గెలిచారు. ఇక రెండోవిడతలో మంత్రి పదవి దక్కింది. మంత్రిగా తన శాఖ
కు సంబంధించి ఎలాంటి పనులు చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఆమె మంత్రి అని తెలుసు గాని ఏ శాఖకు మంత్రి అనేది ప్రజలకు తెలియదు. ఇక ఆమె ప్రతిసారి మీడియాకు రావడం..బాబుని లేదా పవన్ని తిట్టడం…జగన్కు భజన చేయడం…అసలు సొంత నియోజకవర్గంలో కూడా అభివృద్ది చేస్తున్నట్లు లేరు.
ఇలా చేయడం వల్లే రోజాకు మైనస్ అయ్యేలా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల ఏమి తెలియడం లేదు గాని…ఆ అధికారం శాశ్వతం కాదని రోజాకు తెలిసే సమయం వచ్చిందని టిడిపి శ్రేణులు అంటున్నాయి. ఇక రానున్న ఎన్నికల్లో రోజా మళ్ళీ నగరి బరిలోనే దిగే ఛాన్స్ ఉంది. ఇక ఆమెని టిడిపి కాదు..సొంత పార్టీ వాళ్లే ఓడించేలా ఉన్నారు. ఇప్పటికే పలు సర్వేల్లో ఆమె ఓటమి దిశగా వెళుతున్నారని తేలింది. కాబట్టి నగరిలో ఈ సారి రోజా గెలుపు డౌటే.