విజయవాడ అంటే టిడిపికి కంచుకోట అని అంతా అనుకుంటారు..కానీ ఒకప్పుడు అక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ హవా నడిచేది..రాష్ట్రం విడిపోయాకే టిడిపికి పట్టు దొరికింది. అయినా ఇప్పటికీ విజయవాడలో వెస్ట్ పార్ట్ లో టిడిపికి ఛాన్స్ దొరకడం లేదు. అసలు మొదట నుంచి ఈ సీటు టిడిపికి కలిసిరాదు. ఎప్పుడో 1983లో ఒకసారి గెలిచింది అంతే..మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. కానీ మధ్యలో టిడిపితో పొత్తులో భాగంగా సిపిఐ రెండుసార్లు గెలిచింది.
అయితే 2014లో టిడిపి డైరక్ట్ పోటీ చేసి ఉంటే గెలిచేది..కానీ పొత్తులో భాగంగా ఈ సీటు బిజేపికి ఇచ్చారు. దీంతో ఓటమి పాలయ్యారు. అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ టిడిపిలోకి వచ్చారు. 2019లో ఇక్కడ జనసేన వల్ల టిడిపి దెబ్బతింది. జనసేన ఓట్లు చీల్చడంతో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. మంత్రిగా చేసిన ఆయనపై వ్యతిరేకత గట్టిగానే ఉంది. దీంతో సరైన ప్రత్యర్ధి గాని నిలబడితే వెల్లంపల్లికి చెక్ పడుతుంది.
కాకపోతే ఇక్కడ పొత్తుపై సీటు ఆధారపడి ఉంది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకే దక్కే ఛాన్స్ ఉంది. పొత్తు లేకపోతే మళ్ళీ ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అయితే టిడిపి నుంచి సీటు కోసం జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బుద్దా వెంకన్న లాంటి వారు పోటీ పడుతున్నారు. కానీ నియోజకవర్గ బాధ్యతలని ఎంపీ కేశినేని నానికి ఇచ్చారు.
దీంతో సీటుపై క్లారిటీ లేదు. అదే సమయంలో టిడిపి-జనసేన-బిజేపి పొత్తు ఫిక్స్ అయితే అప్పుడు ఎలా సర్దుబాటు చేస్తారనేది చూడాలి. మొత్తానికి పొత్తు ఉంటే మాత్రం ఈ సీటులో టిడిపి పోటీ చేయదు.