వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హావా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆ పార్టీలో రెడ్డి వర్గానికే పెద్ద పీఠ వేస్తారు. ప్రధాన పదవులు రెడ్డి వర్గానికే దక్కుతాయి. అసలు వైసీపీ 151 ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో దాదాపు 50 మంది వరకు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. రాయలసీమలో ప్రతి జిల్లాలో 6-8 మంది రెడ్డి ఎమ్మెల్యేలే. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు ఉంటే..అందులో 12 సీట్లు వైసీపీ, 2 సీట్లు టిడిపి గెలుచుకుంది. ఇక 12 మందిలో 8 మంది రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలే.
అంటే అనంత వైసీపీలో రెడ్డి వర్గం హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ ఎమ్మెల్యేల్లో ఒకే పేరుతో ఉన్న ముగ్గురు హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డి, వై.వెంకట్రామి రెడ్డి. ఈ ముగ్గురు వైసీపీ నుంచి గెలిచారు. కేతిరెడ్డి ధర్మవరం బరిలో గెలవగా, అనంత..అనంతపురం అర్బన్ లో గెలిచారు. అటు వై.వెంకట్రామి రెడ్డి గుంతకల్ లో గెలిచారు.
మరి వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురులో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అనే అంశం చూస్తే..ప్రస్తుతానికి ముగ్గురికి అవకాశాలు ఉన్నాయ్ని సర్వేల్లో తేలింది. కాకపోతే కేతిరెడ్డి తప్ప..మిగతా ఇద్దరికి పాజిటివ్ తక్కువే. ముఖ్యంగా గుంతకల్ లో వై.వెంకట్రామి రెడ్డిపై వ్యతిరేకత ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ టిడిపి నేత జితేందర్ గౌడ్ అనుకున్న మేర బలపడకపోవడమే వైసీపీకి ప్లస్.
అటు అనంతలో ఎమ్మెల్యేకు కూడా కాస్త పాజిటివ్ తక్కువే. అయితే ఇక్కడ టిడిపి-జనసేన కాంబినేషన్ వైసీపీకి చెక్ పెట్టవచ్చు. ఇక ధర్మావరంలో కేతిరెడ్డికి చెక్ పెట్టడానికి పరిటాల శ్రీరామ్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పటికే కేతిరెడ్డిపై నెగిటివ్ మొదలైంది. ఇది ఇంకా పెరిగితే ఈ సీటులో కూడా వైసీపీకి గెలుపు కష్టమే. మరి ఈ ముగ్గురు వెంకట్రామి రెడ్డిల్లో ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి.