ఏజెన్సీ ప్రాంతమైన అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ఏ మాత్రం బలపడినట్లు కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు యాక్టివ్ గా ఉన్నాయి. కానీ అరకులో మాత్రం యాక్టివ్ గా లేవు. అసలు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో కూడా తెలియని పరిస్తితి. అక్కడ టిడిపి నేతలు దూకుడుగా పనిచేస్తున్నట్లు కూడా లేరు. అలా అని వైసీపీ ఎమ్మెల్యేకు ఏమైనా ప్లస్ ఉందా? అంటే అదేం లేదు.
సరైనా అభివృధ్ది చేయడం లేదు..కనీస అవసరాలు తాగునీరు, రోడ్లు, ఆసుపత్రి సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో ఉన్నారు. మరి అలనాటప్పుడు టిడిపి పోరాటం చేస్తే..ఆ పార్టీకి రాజకీయంగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. కానీ అలా చేయడం లేదు. దీంతో అరకులో టిడిపి వెనుకబడి ఉంది. అక్కడ మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పూర్తిగా వెనుకబడి ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి డిపాజిట్ కోల్పోయిన సీటు ఏదైనా ఉందా? అంటే అది అరకు సీటు మాత్రమే. కేవలం 19 వేల ఓట్లే ఇక్కడ టిడిపికి వచ్చాయి.
ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొన్ను దొరకు 27 వేల ఓట్లు వచ్చి రెండో స్థానంలో నిలిచారు. అయితే దొన్ను దొర టిడిపిలోకి వచ్చారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో అరకు సీటు ఎవరికి దక్కుతుందనేది తేలాల్సి ఉంది. ఓ వైపు శ్రవణ్, మరోవైపు దొన్ను దొర ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి సీటు దక్కే ఛాన్స్ ఉంది.
కానీ ఎవరికి దక్కిన ఇక్కడ వైసీపీకే ఆధిక్యం కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతం కావడం ప్రభుత్వ పథకాలు, గిరిజన్లు మొదట నుంచి వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు. దీంతో ఇక్కడ టిడిపికి పట్టు దొరకడం లేదు. ఇదే పరిస్తితి ఉంటే మళ్ళీ అరకు సీటు ఫ్యాన్ తన్నుకుపోతుంది.