కంచుకోటల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. ఈ సారి గెలుపు దిశగా వెళ్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కంచుకోటల్లో కూడా టిడిపి ఓడిపోయింది. కానీ ఇప్పుడు టిడిపి పికప్ అయింది. వైసీపీకి యాంటీ ఉండటం, టిడిపి నేతలు దూకుడుగా పనిచేయడంతో చాలా కంచుకోటల్లో పుంజుకుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండలో టిడిపి పికప్ అయింది.
మామూలుగా పెనుకొండ అంటే టిడిపి అడ్డా..1983, 1985, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టిడిపి గెలిచింది. అందులో మూడుసార్లు దివంగత పరిటాల రవీంద్ర గెలిచారు. 2004లో గెలిచాక ఆయన హత్య జరిగింది. దీంతో 2005 ఉపఎన్నికలో పరిటాల సునీతమ్మ గెలిచారు. ఇక 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి బికే పార్థసారథి గెలిచారు. ఇక టిడిపి అధికారంలో ఉంటూ కియా లాంటి పరిశ్రమ తెచ్చిన 2019లో టిడిపి ఓడిపోయింది.
వైసీపీ నుంచి శంకర్ నారాయణ గెలిచారు. వెంటనే ఆయనకు మంత్రి పదవి వచ్చింది. మంత్రిగా పెద్దగా రాణించలేదు. పైగా ఆయన బంధువుల అక్రమాలు పెరిగాయని ఆరోపణలు వచ్చాయి. తర్వాత మంత్రి పదవి పోయింది. ఎమ్మెల్యేగా కూడా శంకర్ నారాయణ పెద్దగా పనిచేయడం లేదు. అభివృధ్ది శూన్యం. దీంతో టిడిపి మళ్ళీ లైన్ లోకి వచ్చింది. ఇంచార్జ్ బికే పార్థసారథి బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే ఇదే సీటు కోసం సవితమ్మ కూడా పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య సీటు పోటీ నడుస్తుంది.
ఇక చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారో అర్ధం కాకుండా ఉంది. ఇలా గ్రూపు రాజకీయం టిడిపికే ఇబ్బంది కానీ ఎవరికి సీటు ఇచ్చిన కలిసి పనిచేస్తే పెనుకొండలో టిడిపి వన్ సైడ్ గా గెలుస్తుంది.