అధికార వైసీపీపై రోజురోజుకూ వ్యతిరేకత పెరగడం, అలాగే ఆ పార్టీలో సీట్ల కోసం నేతల కుమ్ములాడుకోవడం…ఈ పరిస్తితుల్లో సీటు ఛాన్స్ లేని వారు..వైసీపీ గెలుపు కష్టమని భావించే నేతలు..ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే కొందరు గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరిపోయారు. ఇక తాజాగా విశాఖ లో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చేశారు.
అయితే ఆయన టిడిపిలో చేరతారని మొదట ప్రచారం జరిగింది..కానీ టిడిపిలో ఆయనకు అవకాశాలు తక్కువగా వస్తుందని భావించి..ఆయన జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. తాజాగా పవన్ని కలిశారు. రెండు, మూడు రోజుల్లో జనసేన కండువా కప్పుకుంటారు. ఇక జనసేనలో చేరుతున్న పంచకర్ల రమేష్ బాబుకు సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారని ప్రచారం వస్తుంది. జనసేన తరుపున ఆయనకు పెందుర్తి సీటు ఇస్తారని అంటున్నారు.
అయితే 2009లో రమేష్ ప్రజారాజ్యం నుంచి పెందుర్తిలో గెలిచారు. 2014లో టిడిపి నుంచి ఎలమంచిలిలో పోటీ చేసి గెలిచారు. 2019లో ఓడిపోయారు. తర్వాత టిడిపి వదిలి వైసీపీలోకి వెళ్లారు. వైసీపీలో సీటు గ్యారెంటీ లేదు. దీంతో వైసీపీని వదిలి జనసేన వైపుకు వచ్చారు. ఎలాగో జనసేన తరుపున ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. అందుకే పెందుర్తి సీటు రమేష్ ఆశిస్తున్నారని తెలిసింది.
ఇక పొత్తులు లేకుండా ఉంటే జనసేన నుంచి పెందుర్తిలో రమేష్ పోటీ చేయడానికి ఇబ్బంది లేదు. అలా అని అక్కడ జనసేన సింగిల్ గా గెలవడం అసాధ్యం. టిడిపి సపోర్ట్ కావాల్సిందే. పొత్తు ఉంటే మాత్రం ఈ సీటు వదులుకోదు. ఎందుకంటే అక్కడ టిడిపి సీనియర్ బండారు సత్యనారాయణ ఉన్నారు. కాబట్టి పెందుర్తి సీటు టిడిపి వదులుకునే ఛాన్స్ లేదు.