ఏలూరి సాంబశివరావు..2014 ముందు వరకు ఈ పేరు ఏపీ రాజకీయాల్లో పెద్దగా వినబడలేదు. అలాగే 2014లో పర్చూరు నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పుడు కూడా టిడిపి ఎమ్మెల్యే అని ఆ నియోజకవర్గం వరకే తెలుసు. కానీ 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో సీనియర్ నేత..సీనియర్ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి నిలబడితే..యువనాయకుడైన ఏలూరి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పొరాడి గెలిచారు.
ఓ వైపు సీనియర్ నేత, మరోవైపు వైసీపీ గాలి…ఇలా ఎన్ని ఉన్నా పర్చూరులో మళ్ళీ గెలిచి సత్తా చాటారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అవసరమైతే సొంత డబ్బు సైతం ఖర్చు పెడుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇటు కష్టాల్లో అధినేతకు అండగా నిలబడుతూ వస్తున్నారు. ఇలా అన్నీ రకాలుగా సత్తా చాటుతున్న ఏలూరి మరోసారి పర్చూరులో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
అయితే ఏలూరి హ్యాట్రిక్ కి బ్రేకులు వేయాలని జగన్ చూస్తున్నారు. ఏలూరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి..చీరాల నుంచి మాజీ ఆమంచి కృష్ణమోహన్ని తీసుకొచ్చి పర్చూరులో పెట్టారు. ఇక ఆమంచి రావడమే ఏలూరికి ప్లస్. ఆమంచి వచ్చిన పర్చూరులో వైసీపీ బలం పెరగలేదు. వాస్తవానికి ఇంకా తగ్గింది.
ఎందుకంటే పర్చూరులో కమ్మ, కాపు వర్గాల ఓట్లు ఎక్కువ. మొన్నటివరకు వైసీపీ ఇంచార్జ్ గా కమ్మ నేత రావి రామనాథం బాబు ఉండేవారు. దీని వల్ల కమ్మ ఓట్లు అటు, ఇటూగా ఉన్నాయి. పూర్తిగా టిడిపి పడే ఛాన్స్ లేదు. కానీ రావిని తప్పించి కాపుల ఓట్ల కోసం ఆమంచిని తీసుకొచ్చారు. దీంతో వైసీపీకి కమ్మ ఓట్లు మైనస్. ఇటు కాపు ఓట్లు కూడా మైనస్సే. ఎందుకంటే కాపు వర్గంలో ఏలూరికి మంచి పేరుంది. పైగా జనసేనతో పొత్తు ఉంటే కాపు ఓట్లు వన్సైడ్. ఎటు చూసుకున్న ఆమంచి ప్రత్యర్ధిగా ఉంటే ఏలూరి హ్యాట్రిక్ ఖాయం.
ReplyReply allForward |