వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం టార్గెట్ గా ఆయన విరుచుకుపడుతూనే..జనసేనని బలోపేతం చేసే దిశగా వెళుతున్నారు. ఇక టిడిపితో పొత్తుని దృష్టిలో ఉంచుకుని జనసేన దాదాపు తీసుకునే సీట్లలోనే పవన్ యాత్ర కొనసాగుతుంది. ఇటీవల ఆయన పలు నియోజకవర్గాల్లో యాత్ర చేయగా, అవి దాదాపు జనసేనకు పట్టున్న స్థానాలే.
అదే సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో నరసాపురం, భీమవరంలో పవన్ యాత్ర సాగింది. అయితే షెడ్యూల్ లో పాలకొల్లు కూడా ఉంది. కానీ పవన్ పాలకొల్లు వెళ్లలేదు. ఎందుకంటే అది టిడిపి సిట్టింగ్ సీటు. ఇదిలా ఉంటే జులై 5,6 తేదీల్లో పవన్ రాజమండ్రి పర్యటన ఉంది. దీంతో అక్కడ సీట్లపై చర్చ జరుగుతుంది. పవన్ ఏ ఏ నియోజకవర్గాల్లో పర్యటిస్తారో చూడాలి. ఇక రాజమండ్రి రూరల్ లో పవన్ పర్యటన ఉంటుందని తెలుస్తుంది.
అయితే ఇటీవల సర్వేల్లో రాజమండ్రి రూరల్ లో జనసేన బలం పెరిగిందని అంటున్నారు. కానీ గత రెండు ఎన్నికల నుంచి ఇక్కడ టిడిపి బుచ్చయ్య చౌదరీ గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో బుచ్చయ్య…వైసీపీపై 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. బుచ్చయ్యకు మొత్తం 74 వేల ఓట్లు రాగా, వైసీపీకి 64 వేలు వచ్చాయి. జనసేనకు 42 వేల ఓట్లు వచ్చాయి. అంటే జనసేనకు భారీ ఓటింగ్ ఉంది.
అయితే ఇప్పుడు ఆ ఓట్లు మరింత పెరిగాయని జనసేన శ్రేణులు అంటున్నాయి.ఇదే క్రమంలో పవన్ రాజమండ్రి టూర్ ఉంది. దీంతో పొత్తులో భాగంగా జనసేన రాజమండ్రి రూరల్ అడుగుతుందా? అనే డౌట్ ఉంది. కానీ అక్కడ బుచ్చయ్య ఉన్నారు కాబట్టి..టిడిపి అంత తేలికగా ఆ సీటు వదులుకునే అవకాశాలు లేవు. జనసేనకు వేరే సీటు అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాజమండ్రి సీటు విషయంలో ఏం జరుగుతుందో