చిలకలూరిపేటలో ఈ సారి రాజకీయ పోరు హోరాహోరీగా సాగనుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఉండటం వల్ల తొలిసారి పోటీ చేసి విడదల రజిని విజయం సాధించారు. కానీ ఈ సారి అలాంటి పరిస్తితూలు కనిపించడం లేదు. టిడిపి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు..ఈ సారి పేటలో పాగా వేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో రజిని అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. అసలు రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదని అంటున్నారు. ఆరోగ్యశాఖలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, ఇటు చిలకలూరిపేట మున్సిపాలిటీలో పనులు చేయకుండానే రూ.2.70 కోట్ల బిల్లులు చేసుకున్నారని, అటు మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని ఆరోపించారు. ఇలా పెద్ద ఎత్తున రజినిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాజకీయంగా పేటలో ఆమె వెనుకబడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ముందున్న..పేట ప్రజల్లో మాత్రం నెగిటివ్ తెచ్చుకున్నారు.
ఇటు టిడిపి నేత ప్రత్తిపాటి ఈ సారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా రజినికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే పేటలో ఒకసారి ఎవరి బలమెంత అనేది ఒకసారి చూస్తే..ప్రత్తిపాటి సీనియర్ నాయకుడు మూడుసార్లు గెలిచారు. పేటపై పట్టు ఉంది. ఇక్కడ బలంగా కమ్మ వర్గం ఉండటం..గతంలో అభివృద్ధి చేయడం ప్రత్తిపాటికి ప్లస్.
ఇక రజినికి బిసి వర్గం కావడం..అక్కడ బిసి ఓట్లు ఎక్కువగా ఉండటం ఆమెకు ప్లస్. మంత్రిగా ఉండటంతో అధికార బలం ఉంది. అలాగే అన్నిరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పేటలో కమ్మ ఓట్లు 40 వేలు, ఎస్సీలు 65 వేలు, వైశ్యుల ఓట్లు 25 వేలు, ముస్లిం ఓట్లు 30 వేలు, రెడ్లు 10 వేల దాకా ఉంటారు. బిసి వర్గాలు 50 వేల వరకు ఉంటాయి.
అయితే పేటలోని వైసీపీ నేత మర్రి రాజశేఖర్..రజినికి యాంటీగా ఉన్నారు. అటు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..రజినికి పడటం లేదు. గత ఎన్నికల్లో వీరి వల్ల కొంత కమ్మ ఓట్లు రజినికి పడ్డాయి. ఈ సారి పడే ఛాన్స్ లేదు. అటు బిసిలు సగం టిడిపి వైపే ఉన్నారు. ఎస్సీలు టిడిపికి 40 శాతం మద్ధతు ఉంది. బిజేపితో వైసీపీ అంటకాగుతుంది. దీంతో ముస్లిం ఓట్లలో మార్పు ఉంటుంది. ఓవరాల్ గా ఇక్కడ ప్రత్తిపాటికి స్వల్ప లీడ్ కనిపిస్తోంది.