కింజరపు రామ్మోహన్ నాయుడు టిడిపిలోని యువ నాయకులలో రామ్మోహన్ ఒకరు. అతి తక్కువ వయసులో ఎంపీగా గెలిచి జిల్లాలో నే కాకుండా కేంద్రంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు. పార్లమెంట్ లో తన స్వరాన్ని రాష్ట్రానికి రావలసిన అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే జోన్ ప్రత్యేక హోదా మొదలైన విషయాలపై గట్టిగా వినిపించారు ఈ సిక్కోలు సింగం.
మొదటినుండి రాజకీయ కుటుంబమే అయిన రాజకీయాలకు దూరంగా పెరిగిన రామ్మోహన్ నాయుడు 2012లో అనూహ్యంగా తండ్రి ఎర్రనాయుడు మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం ఎంపీగా 2014లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి రెడ్డి శాంతి పై లక్షకుపైగా భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 26 ఏళ్ల వయసులో ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టి తెలుగు బాణీని పార్లమెంట్లో గట్టిగా వినిపించారు. 2019లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పై తక్కువ మెజారిటీతో విజయం సాధించారు. 2024లో కూడా విజయం సాధించి హాట్రిక్ ను సొంతం చేసుకోవాలని రామ్మోహన్ నాయుడు ఆలోచిస్తున్నాడు.
ఎంపీ నిధులతో జిల్లాలోని మౌలిక వసతులను కల్పించడంలో స్థాయిలో సఫలం అయ్యారని చెప్పవచ్చు. కానీ రైల్వే జోన్ ఉద్దానం సమస్యపై తన బాణీని లోక్ సభ లో వినిపించినా కార్యరూపం దాల్చడంలో మాత్రం వెనకబడే ఉన్నారు. సిక్కోలు ప్రజలకు అందుబాటులో ఉంటూ మా మనిషి అని సిక్కోలు ప్రజలంతా చెప్పుకునేలా ప్రజల హృదయంలో సుస్థిర స్థానం సంపాదించిన రామ్మోహన్ నాయుడు ఈసారి కూడా ఎన్నికలలో విజయం సాధించి తన సేవలను ప్రజలకు అందించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. కొసమెరుపు ఏంటంటే అధికార పార్టీ వైసిపి ఇప్పటివరకు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు పై పోటీగా నిలబెట్టే అభ్యర్థిని కూడా ప్రకటించలేదు….
ReplyReply allForward |