వైసిపి కీలక నేతలలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఒకరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన సురేష్ 2009లో కాంగ్రెస్ చేరి వై పాలెం నుండి విజయం సాధించారు. ఆ తర్వాత జగన్ సారథ్యంలో వైసీపీలోకి మారారు. 2014లో వైపాలెం టికెట్ కాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒత్తిడితో జగన్, సురేష్ కు సంతనూతలపాడు ను ఇచ్చారు. అక్కడ సురేష్ గెలిచారు.
అటు వైపాలెంలో డేవిడ్ రాజును బాలినేని గెలిపించుకున్నారు. కానీ డేవిడ్ రాజు టిడిపి వైపు మొగ్గు చూపుతుండటంతో 2016 లో సంతనూతలపాడు తో పాటు వైపాలెం బాధ్యతలు కూడా సురేష్ తీసుకున్నారు. 2019లో వైపాలెం నుంచి గెలిచి క్యాబినెట్ మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ లో కూడా తన మంత్రి పదవిని కాపాడుకోగలిగారు సురేష్. అటు బాలినేని మంత్రి పదవి పోయింది. అప్పటినుంచి బాలినేని శ్రీనివాస రెడ్డికి.. సురేష్ అంటే విముఖత పెరిగిందని చెప్పవచ్చు.
జగన్ మద్దతు సురేష్ కు ఉండడంతో కొంతమంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు. సొంత సామాజిక వర్గం వారిమైన తమ కన్నా సురేష్ కి జగన్ ఎక్కువ విలువ ఇస్తున్నారని నాయకులంతా గుర్రు గా ఉన్నారు. దీంతో వైపాలెంలో మంత్రికి వ్యతిరేకంగా ఒక గ్రూపుని తయారు చేశారని, వారు మంత్రికి సీటు రాకుండా పావులు కదుపుతున్నారని తెలిసింది.
వైపాలెంలో సురేష్ కు టికెట్ ఇవ్వవద్దని సొంత సామాజిక వర్గ నేతల ఒత్తిడి ఉన్న తరుణంలో సురేష్ను మరో రిజర్వడ్ సీటులోకి మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా టిడిపి కంచుకోట అయిన కొండపి పంపుతారని సమాచారం..అక్కడైతే సురేష్ ఓడిపోతారని..వైసీపీలోని రెడ్డి వర్గం భావిస్తుంది. చూడాలి మరి చివరికి సురేష్కు ఏ సీటు దక్కుతుందో.