జగన్కు స్క్రిప్ట్ ఎవరు రాసి ఇస్తున్నారో తెలియదు గాని..ఆ స్క్రిప్ట్ జగన్ చదువుతుంటే..అసలు జగన్ అమాయకుడు..చంద్రబాబు, పావన్ దుర్మార్గులు…కావాలని కుట్రలు చేసి జగన్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటారు. అంటే ఏమి తెలియని వాళ్ళు అదే అనుకుంటారు. కానీ ఇప్పుడు జనాలకు అన్నీ తెలుసు..ఎవరేం చేస్తున్నారో తెలుసు..కాబట్టి జగన్ ఏదో స్క్రిప్ట్ ముందు పెట్టుకుని స్పీచ్ ఇచ్చినంత మాత్రాన అది ప్రజలు నమ్మడం కష్టం..పైగా రివర్స్ లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.
అయితే జగన్ స్క్రిప్ట్ లో ఎక్కువ గా…తాను ప్రజలకు మంచి చేస్తున్నానని, ఇంతలా ఎవరు చేయడం లేదని, టిడిపి హయంలో మంచి జరిగిందో…ఇప్పుడు మంచి జరిగిందో పోల్చుకోవాలని అంటారు. అలాగే అప్పుడు దోపిడి జరిగిందని, ఇప్పుడు అవినీతి లేదంటారు. ఇక బాబుకు మాదిరిగా తనకు సొంత మీడియా లేదంటారు. ఒంటరి వాడినని అంటారు..ప్రజలే అండగా ఉండాలని అంటారు.
ఇక బాబు-పవన్ రౌడీయిజం చేస్తున్నారని, బూతులు మాట్లాడుతున్నారని, వాళ్ళకు లాగా తమకు బూతులు రావని అంటున్నారు. మరి ఇవన్నీ నమ్మేలా ఉన్నాయా? అంటే అసలు బూతులు మొదలుపెట్టిందే వైసీపీ నేతలు..రౌడీయిజం గురించి చెప్పాల్సిన పని లేదు. జగన్కు భజన చేసే మీడియా ఏంటో జనాలకు తెలుసు. దోపిడీలు, అక్రమాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసు.
అప్పులు చేయడం, ప్రజలపై పన్నుల భారం పెంచడం..కొందరికి పథకాల రూపంలో డబ్బులు పంచడం..అభివృద్ధి చేయకపోవడం…ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ పోల్చుకుంటే గత ప్రభుత్వాలే మేలు అని అనుకుంటారు. కాబట్టి జగన్ ఏం చెప్పిన..అది ఆయనకే రివర్స్ అయ్యి..డ్యామేజ్ అవుతుందని చెప్పవచ్చు.