చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత లోకేష్ లోని నాయకత్వం లక్షణాలు పూర్తిగా బయటకు వచ్చాయని టిడిపి నాయకులు అంటున్నారు. లోకేష్ ఏ విషయాన్నైనా సూటిగా, స్పష్టంగా చెబుతున్నారని టిడిపి నేతలు అంటున్నారు. లోకేష్ ఢిల్లీలో ఉన్నా, ఏపీలో ఉన్న లోకేష్ టిడిపి నేతలు అందరికీ దిశా నిర్దేశం చేస్తున్నారని టిడిపి నేతలు అంటున్నారు.
చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన మాట వినేవారని ఏదైనా చెప్పి తప్పించుకోవచ్చు అ,ని లోకేష్ అలా కాదని తను చెప్పిన మాట వినకపోతే ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనకాడారంటూ సీనియర్లంతా వాపోతున్నారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు గురించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయమని లోకేష్ ఆదేశిస్తే ,చాలామంది ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారని లోకేష్ సీరియస్ గా ఉన్నారు.
టిడిపి సానుభూతిపరుల ఓట్లను వైసిపి తొలగిస్తున్నా, టిడిపి నేతలు అంతా తమకు సంబంధం లేనట్టు ఉండడంతో లోకేష్ వారిపై చర్యలు సిద్ధమయ్యారని వార్తలు కూడా వస్తున్నాయి. అందరిని కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నారని సీనియర్లు అంటున్నారు. టిడిపి అధికారంలోకి రావాలంటే అందరితో ఇలా కఠినంగానే వ్యవహరించాలని అందరూ తనను అర్థం చేసుకొని టిడిపి అధికారంలోకి రావడానికి సహకరించాలని లోకేష్ అందరిని కోరుతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి టిడిపి కేడర్ కూడా ఇలాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
ఏదో మొహమాట పడితే పార్టీకి నష్టమని, ఏదైనా ఒక విషయంలో కఠినంగా ఉంటూ..పార్టీ కార్యక్రమాలని ముందుకు నడిపిస్తే..అప్పుడే సక్సెస్ అవుతారని, అలా లోకేశ్ బాగా పనిచేస్తున్నారని భావిస్తున్నారు. 2019లో ఓటమి తర్వాత లోకేష్ రాటుదేలాడు అని, మాస్ నాయకుడుగా ఎదిగారని, ఎగతాళి చేసిన వారి నోర్లు మూయించారని, ఇప్పుడు బాబు అరెస్టుతో పార్టీని కూడా నడిపించే సత్తా ఉన్న అధినేతగా ఎదిగే లక్షణాలు లోకేష్కు వచ్చాయని అంటున్నారు.
ReplyReply allForward |