ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 అంటే విజయసాయిరెడ్డి. జగన్ తర్వాత వైసీపీలో ఆయనదే హవా..కానీ నిదానంగా ఆయన హవా తగ్గింది. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరి డామినేషన్ పెరగడంతో సాయిరెడ్డి సైడ్ అయ్యారు. అలాగే 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ విజయంలో సాయిరెడ్డిది కీలక పాత్ర. కానీ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా తొలగించారు.
అయితే చాలాకాలంగా ఆయన వైసీపీలో యాక్టివ్ గా లేరు. కానీ ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు. పైగా ఆ మధ్య తూర్పు రాయలసీమ..ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో ఆర్డినేటర్ పదవి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తప్పుకున్నారు. దీంతో ఆ పదవిని సాయిరెడ్డికి అప్పగించాలని జగన్ చూస్తున్నారు. దాదాపు ఆయన్ని ఒప్పించి అక్కడకు పంపాలని ఫిక్స్ అయ్యారు. రేపో మాపో అధికారికంగా సాయిరెడ్డికి బాధ్యతలు ఇస్తారు. ఇక వైసీపీకి ఎంత బలమైన ప్రాంతంగా ఉండే ఈస్ట్ సీమలో ఇప్పుడు టిడిపి బలపడుతుంది.
వైసీపీలో ఎక్కడకక్కడ గ్రూపు తగాదాలు ఉన్నాయి. అందుకే బాలినేని సైడ్ అయ్యారు. ప్రకాశంలో టిడిపి లీడ్ ఉంది. నెల్లూరులో సైతం వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా టిడిపి ఉంది. దాదాపు అక్కడ కూడా టిడిపి లీడ్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక చిత్తూరులో వైసీపీ స్వల్ప లీడ్ లో ఉంది..కానీ ఎన్నికల సమయంలో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది.
ఇలా ఈస్ట్ సీమలో వైసీపీకి బిగ్ ట్రబుల్స్ ఉన్నాయి. ఆధిపత్య పోరు ఉంది. వీటి అన్నిటిని సాయిరెడ్డి సెట్ చేయాలి. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇప్పటికిప్పుడు ఇవి సెట్ అవ్వడం కష్టమే. టిడిపి ఆధిక్యాన్ని ఆపడం కష్టమే.