రాష్ట్రంలో టిడిపి బలం పెరుగుతుంది…వైసీపీకి ధీటుగా టిడిపి ఎదుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకునే దిశగా టిడిపి వెళుతుంది. అయితే టిడిపికి బలం పెరగడం..అటు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉండటంతో నేతల్లో పోటీ పెరిగింది. పలు సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. అయితే టిడిపి బలం పెరిగింది కనుకే ఇలా సీట్ల కోసం పోటీ పెరిగిందని చెప్పవచ్చు.
కానీ ఇదే పోటీ వల్ల టిడిపికి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎవరికి వారు ఐక్యంగా పనిచేయకుండా గ్రూపులుగా ఏర్పడి..ఎన్నికల సమయంలో ఒకరినొకరు సహకరించుకోకపోతే ఓట్లు చీలిపోయి టిడిపికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యకు టిడిపి అధినేత చంద్రబాబు ముందే చెక్ పెట్టారు. ఒకే సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి.ఇటీవల కాలంలోనే పలు స్థానాల్లో నేతలు సీటు తమదంటే తమదని అంటున్నారు.
ఉదాహరణకు చిలకలూరిపేట సీటులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు..ఆయన ఉండగానే భాష్యం ప్రవీణ్ అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు చివరికి ప్రత్తిపాటి..భాష్యంకు షోకాజ్ నోటీసు ఇచ్చేలా పరిస్తితి వచ్చింది. అటు సత్తెనపల్లి గాని, గుంటూరు వెస్ట్ ఇలా కొన్ని సీట్లలో పంచాయితీ ఉంది. అటు సూళ్ళూరుపేట సీటులో కూడా ఇదే రచ్చ..మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం వర్సెస్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నట్లు ఉంది. మధ్యలో శ్రీపతి బాబు సీటు కోసం పోటీకి వచ్చారు.
ఇటు పెడన సీటులో ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ఉండగానే..మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఫ్యామిలీ, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ పోటీకి వస్తున్నారు. గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము…ఇలా చాలా సీట్లలో నేతల మధ్య పోటీ ఉంది. అయితే త్వరగా చంద్రబాబు సీట్లు తేల్చకపోతే ఈ పంచాయితీ ఎన్నికల వరకు కొనసాగి టిడిపికే నష్టం చేస్తుంది.