సర్వేపల్లి..టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గం. ఎన్ని సార్లు ఓడిన సరే..ఆయన సర్వేపల్లిని వదలడం లేదు. అక్కడ ప్రజలకు అండగానే ఉంటున్నారు. ఎప్పుడో 1994, 1999 ఎన్నికల్లో సోమిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి సర్వేపల్లి ప్రజలు ఆయన్ని ఓడిస్తూనే ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచింది.
2012 కోవూరు ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో సోమిరెడ్డి ఓడిపోయారు. అయితే 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో మధ్యలో సోమిరెడ్డికి ఎమ్మెల్సీ దక్కింది. అలాగే చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కింది. దీంతో మంత్రిగా ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేశారు. ఇక ఈ సారి ఇక్కడ గెలవాలని చెప్పి ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుని 2019 ఎన్నికల్లో పోటీచేశారు. కానీ ప్రజలు ఆయన్ని మళ్ళీ ఓడించారు.
ఇక ఈయనపై గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డి రెండో విడతలో మంత్రి అయ్యారు. మంత్రిగా ఈయన పనితీరు ఏమి గొప్పగా లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులకు చేస్తున్నది ఏమి లేదు. ఏదో ప్రభుత్వం నుంచి పథకాలు తప్ప. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కూడా తక్కువే. ఇక ఇక్కడ అధికార పార్టీ అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని టిడిపి ఆరోపిస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సోమిరెడ్డి బలపడుతున్నారు. ఆయనపై ఓడిన సానుభూతి ఉంది.
కానీ ఎంత ఉన్నా సరే ప్రస్తుతానికి స్వల్ప ఆధిక్యం వైసీపీకే ఉందని సర్వేల్లో తేలింది. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాల ప్రభావం ఎక్కువ కావడంతో..ఇక్కడ వైసీపీకే లీడ్ కనిపిస్తుండ్డి. అయితే సోమిరెడ్డి ఇంకాస్త కష్టపడి..ప్రజా మద్ధతు పెంచుకుంటే సులువుగా గెలుస్తారు. మరి ఈ సారైనా సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని గెలిపిస్తారో లేదో చూడాలి.