ఈ మధ్య ఏ నేషనల్ సర్వే చూసిన వైసీపీకి తిరుగులేదని…వన్సైడ్ గా గెలిచేస్తుందని చెబుతున్నాయి. ఆ మధ్య ఓ నేషనల్ మీడియా సంస్థ విడుదల చేసిన సర్వేలో వైసీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, టిడిపి 0-1 సీటు గెలుచుకుంటుందని చెప్పింది. ఇక తాజాగా ఇండియా టీవీ అనే సంస్థ..వైసీపీ 18, టిడిపి 7 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది.
మరి ఇవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? నిజంగానే మళ్ళీ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారా? వైసీపీ ఎంపీలు అంత అద్భుతంగా పనిచేస్తున్నారా? అంటే ఇదంతా నమ్మడానికి వీలుగా లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో 25కి 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు. దీంతో ప్రజలు వైసీపీకి 22, టిడిపికి 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ అన్నీ సీట్లు ఇచ్చిన జగన్ చేసింది ఏమి లేదు. కేంద్రం మెడలు వంచలేమని చెప్పేశారు. వారిని ఏదైనా ప్లీజ్, ప్లీజ్ అని అడగాలని అన్నారు.
ఇక ఎంపీలు ఏమైనా చేస్తున్నారా? పార్లమెంట్ లో రాష్ట్రం కోసం పోరాడుతున్నారా? అంటే అబ్బే అసలు వాళ్ళు పార్లమెంట్ లో పెద్దగా మాట్లాడినట్లే కనిపించలేదని చెప్పవచ్చు. ఇక రాష్ట్రానికి వారు ఒరగబెట్టింది ఏమి లేదు. వారు ఎంపీలు అని.. సొంత పార్లమెంట్ స్థానాల ప్రజలకే తెలియడం లేదు. టిడిపికి ముగ్గురు ఎంపీలు ఉన్న …వారు ఏ స్థాయిలో గళం విప్పుతున్నారో చెప్పాల్సిన పని లేదు. కనీసం వారు చేసినట్లుగా చేయడం లేదు.
మరి అలాంటప్పుడు ప్రజలు మళ్ళీ అంతమంది ఎంపీలని ఎలా గెలిపిస్తారు. అసలు ఆ సర్వేలు నమ్మశక్యంగా కూడా లేవు. ఇక టిడిపి-జనసేన కలిస్తే సీన్ రివర్స్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ పెయిడ్ సర్వేల మ్యాజిక్ అని అంటున్నారు.