కర్నూలు సిటీ స్థానం చాలా కాలంగా టిడిపికి అందని ద్రాక్షగా ఉన్న సీటు. గెలుపు దగ్గర వరకు వచ్చి ఓడిపోవడం అలవాటు అయిపోయింది. కానీ ఈ సారి మాత్రం టిడిపి వదిలేలా లేదు. పైగా వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న రచ్చ టిడిపికి కలిసొచ్చేలా ఉంది. ఆ పార్టీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య పోరు నడుస్తుంది. సీటు కోసం పోటీ పడుతున్నారు.
2014లో వైసీపీ నుంచి ఎస్వీ గెలిచి నెక్స్ట్ టిడిపిలోకి వెళ్లారు. 2019లో సీటు లేదని చెప్పి వైసీపీలోకి వచ్చారు.అయినా వైసీపీలో సీటు దక్కలేదు.వైసీపీ నుంచి హఫీజ్ పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా హఫీజ్ పనితీరు కూడా సరిగ్గా లేదు. ఆయనపై యాంటీ ఉంది. ఇటు ఎస్వీ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. ఎస్వీకే సీటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఒకరికి సీటు దక్కితే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. పైగా యాంటీ ఉంది. దీంతో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఇటు టిడిపి నుంచి టిజి భరత్ కష్టపడుతున్నారు. అయితే ఇక్కడ టిడిపి చివరిగా గెలిచింది 1999 ఎన్నికల్లో..మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. 2004లో 2 వేల ఓట్లతో ఓడిపోయింది. 2009లో పొత్తులో భాగంగా సిపిఐకి సీటు ఇచ్చింది. దీనివల్ల టిడిపి ఓట్లు బదిలీ అవ్వలేదు. కాంగ్రెస్ గెలిచేసింది.
2014లో టిడిపి 3 వేల ఓట్లతో ఓడింది. 2019లో 5 వేల ఓట్ల తేడాతో ఓడింది. ఇలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోతూ వస్తుంది. కానీ ఈ సారి మాత్రం టిడిపి జెండా కర్నూలు కోటపై ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.