తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటుంది..ఈ సారి ఎన్నికల్లో గెలుపు దిశగా వెళుతుంది. అయితే ఇలాంటి పరిస్తుతుల్లో కూడా కొన్ని చోట్ల టిడిపి సరిగా పుంజుకోలేదు. ఇంకా రేసులో వెనుకబడి ఉంది. అలా నంద్యాల పార్లమెంట్ పరిధిలో టిడిపి చాలా వెనుకబడి ఉంది. మామూలుగానే అక్కడ టిడిపికి పట్టు తక్కువ. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న సరే టిడిపికి కలిసిరావడం లేదు. కొందరు టిడిపి నేతలు బాగా పనిచేస్తున్న టిడిపికి పట్టు దొరకడం లేదు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె, పాణ్యం, నందికొట్కూరు, డోన్ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీటిల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. ఇక 2014లో కూడా వీటిల్లో ఒక్క బనగానపల్లె సీటు మాత్రమే గెలిచింది.
ఇప్పుడు కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. ఒక్క బనగానపల్లెలో టిడిపికి ప్లస్ ఉంది. అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి. అక్కడ టిడిపి నేత బీసీ జనార్ధన్ రెడ్డి ప్రజా బలం పెంచుకున్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత టిడిపికి కలిసొస్తుంది. ఇక మిగిలిన స్థానాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంది..కానీ అది టిడిపికి కలిసిరావడం లేదు. ఉదాహరణకు నందికొట్కూరులో ఎమ్మెల్యే పరిస్తితి పెద్దగా బాగోలేదు. కానీ అక్కడ టిడిపికి బలం లేదు. పాణ్యంలో టిడిపి నాయకురాలు గౌరు చరితా రెడ్డి బాగా పనిచేస్తున్నారు..కానీ పట్టు దొరకడం లేదు.
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఉన్నారు..ఆమె అనుకున్న మేర పుంజుకోలేదు. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్తితి అంతే. పైగా భూమా ఫ్యామిలీలో సీట్ల లొల్లి ఉంది. ఇక డోన్ లో టిడిపి నేత సుబ్బారెడ్డి బాగా పనిచేస్తున్నారు. కాకపోతే ఆయన ఇంకా బలపడాలి. శ్రీశైలం పరిస్తితి అంతే. మొత్తానికి నంద్యాలలో టిడిపి మళ్ళీ దెబ్బతినేలా ఉంది.