తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం సాధించే దిశగా ముందుకెళుతుంది. ఈ సారి అధికారం సాధించడం అనేది టిడిపికి చాలా కీలకం. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడిపి ఎన్ని ఇబ్బందులకు గురైందో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి..ఆ దిశగానే అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు..నేతలని పనిచేయిస్తున్నారు. ఇక అధికారం దక్కించుకోవడం కోసం బాబు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేస్తున్నారు.
పొత్తుల గురించి ప్రస్తుతం ప్రస్తావన తీసుకురాకుండా..టిడిపి సొంతంగా గెలిచి అధికారంలోకి రావాలనే దిశగా ముందుకెళుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి బలపడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నారు. మొదట వ్యూహంలో భాగంగా చంద్రబాబు..జిల్లాల పర్యటన చేయడం. ఆ పర్యటనల్లో రోడ్ షోలు, సభలు పెట్టడం..జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని, అరాచకాలని హైలైట్ చేయడం, అలాగే టిడిపి వస్తే ఏం చేస్తుందనేది చెప్పడం..ఇవే ప్రధానంగా ప్రజా మద్ధతు పెంచుకోవడానికి చేస్తున్నారు.
ఇక రెండో వ్యూహం లోకేష్ అమలు చేస్తున్నారు. పాదయాత్రతో ఇప్పటికే లోకేష్ దూసుకెళుతున్నారు. ఈ పాదయాత్రతో అన్నీ వర్గాల ప్రజలని కలుసుకోవడం, వారి సమస్యలు తెలుసుకోవడం, టిడిపి అధికారంలోకి వస్తే వాటిని ఎలా పరిష్కరిస్తుందో వివరించడం..ఇక లోకేష్ ఎక్కడకక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలని ఎండగడుతున్నారు. గత ఎన్నికల్లో టిడిపికి దూరమైన వర్గాలని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మూడో వ్యూహం వచ్చి..చైతన్య రథయాత్ర..మీ భవిష్యత్తుగా మా గ్యారెంటీ అంటూ బస్సు యాత్ర మొదలుపెట్టారు. 5 జోన్లుగా విభజించి..టిడిపి నేతలు ఎక్కడకక్కడ బస్సు యాత్ర చేస్తూ..మినీ మేనిఫెస్టోలోని హామీలని ప్రజలకు వివరించడం..గత టిడిపి హయాంలో అభివృద్ధి ఎలా జరిగిందో వివరించడం..ఇప్పుడు విధ్వంసం ఎలా జరుగుతుందో చెప్పడం. ఇలా త్రిముఖ వ్యూహంతో టిడిపి ముందుకెళుతుంది. ఇవి సక్సెస్ అయితే టిడిపికి తిరుగులేనట్లే