గత ఎన్నికల్లో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకోవాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. వైసీపీని ఖచ్చితంగా నిలువరించి సత్తా చాటాలని చూస్తున్నారు. మరొకసారి వైసీపీని అధికారంలో లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు నేతలు పొత్తులో ముందుకెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే పొత్తు అనేది ఎన్నికల ముందే తేల్చుకొనున్నారు. అప్పటివరకు ఎవరికి వారు తమ పార్టీలని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు.
తమ పార్టీల ఓటింగ్ శాతం పెంచుకునే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 50 శాతం ఓట్లు రాగా, టిడిపికి 40 శాతం ఓట్లు పడ్డాయి. జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు కమ్యూనిస్టుల పొత్తు ఉంది కాబట్టి..జనసేనకు ఒక 7 శాతం వరకు ఓటింగ్ ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ఓటింగ్ శాతం తగ్గించడమే బాబు, పవన్ పని. ఇప్పటికే వైసీపీ ఓటింగ్ శాతం భారీగానే పడిపోయిందని తెలుస్తుంది. వైసీపీకి 13-14 శాతం ఓటింగ్ శాతం డ్రాప్ అయిందని పవన్ అంటున్నారు. వారి లెక్కల ప్రకారం అలా ఉంటే..అంత శాతం కాకపోయిన ఒక 8 శాతం వరకు డ్రాప్ అయినట్లే కనిపిస్తుంది.
ఇదే క్రమంలో టిడిపి ఓటింగ్ 45 శాతం వరకు చేరుకుందని తెలుస్తుంది. అటు వైసీపీకి 42-43 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జనసేనకు 10 శాతం వరకు ఓటింగ్ ఉంటుందని సర్వేల్లో తేలింది. అయితే వైసీపీకి తగ్గే ప్రతి ఓటు జనసేనకు వచ్చేలా చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. కానీ అది సాధ్యం అవ్వని పని చెప్పవచ్చు. ప్రధాన ప్రత్యర్ధి టిడిపికే వైసీపీ యాంటీ ఓట్లు ఎక్కువ వస్తాయి. తర్వాత జనసేనకు వస్తాయి.కాబట్టి జనసేనకు పూర్తిగా వైసీపీ యాంటీ ఓట్లు పడవు.