గత కొన్ని ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపుకు దూరమైన స్థానాలు చాలానే ఉన్నాయి. 1999 ఎన్నికల్లోనే టిడిపి హవా నడిచింది. ఆ తర్వాత నుంచి టిడిపి గెలుపు కోసం పోరాడింది. 2014లో గెలిచి అధికారంలోకి వచ్చింది..కానీ అప్పుడు వన్సైడ్ గా ఏమి గెలవలేదు. దీంతో కొన్ని స్థానాల్లో టిడిపికి కలగానే మిగిలిపోయింది. అలా టిడిపి గెలుపుకు దూరమైన స్థానాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరు కూడా ఒకటి.
ఇక్కడ చివరిగా 1999 ఎన్నికల్లోనే గెలిచింది. 1985, 1994, 1999 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. ఎస్టీ రిజర్వ్ సీటు అయిన పాడేరులో టిడిపికి పట్టు తక్కువ. ఎస్టీలు మొదట నుంచి కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వైపు ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది. 2014లో వైసీపీ నుంచి గిడ్డి ఈశ్వరి గెలిచారు..నెక్స్ట్ ఆమె టిడిపిలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో భాగ్యలక్ష్మీ వైసీపీ నుంచి గెలిచారు. ఈశ్వరి ఓడిపోయారు. అయితే ఎమ్మెల్యేగా భాగ్యలక్ష్మీ పనితీరు సరిగా లేదు. ఆమెకు యాంటీ ఉంది. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు.
ఇలా వైసీపీకి యాంటీగా ఉన్నా సరే దాన్ని ప్లస్ చేసుకోవడంలో ఈశ్వరి విఫలమయ్యారు. దీని వల్ల పాడేరులో టిడిపికి బలం కనిపించడం లేదు. పైగా ఇక్కడ ఎస్టీలు మొదట నుంచి వైఎస్సార్ ఫ్యామిలీపై అభిమానంతో ఉన్నారు. ఇటు పథకాలు వల్ల వైసీపీకే మద్ధతుగా ఉన్నారు.
అంటే పాడేరులో ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే పార్టీల బలాబలాల బట్టే గెలుపోటములు ఉంటాయి. ఇప్పటికీ అక్కడ వైసీపీ ఆధిక్యమే కనిపిస్తోంది. దీని వల్ల పాడేరులో టిడిపి కలగానే మిగిలిపోయేలా ఉంది.