నరసాపురం పార్లమెంట్..కొత్త పశ్చిమ గోదావరి జిల్లా..తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతం. ఇక్కడ ప్రతి నియోజకవర్గం టిడిపి కంచుకోట. పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, తణుకు, ఆచంట..ఇలా ప్రతి నియోజకవర్గంలో టిడిపికి పట్టు ఉండేది. 2014 ఎన్నికల్లో గూడెం సీటు పొత్తులో బిజేపి గెలుచుకుంటే మిగిలిన సీట్లు టిడిపి గెలుచుకుంది.
కానీ 2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం వల్ల కాపు ఓట్లలో చీలిక వచ్చింది. నరసాపురం పరిధిలో కాపు ఓట్ల ప్రభావం ఎక్కువనే సంగతి తెలిసిందే. 2009లో ప్రజారాజ్యం వల్ల, 2019లో జనసేన వల్ల ఇక్కడ టిడిపి నష్టపోయింది. అయితే అక్కడకి పాలకొల్లు, ఉండి సీట్లు టిడిపి గెలుచుకుంది. ఇక ఈ సారి ఎన్నికల్లో నరసాపురంలో టిడిపి ఆధిక్యం సాధించే దిశగా వెళుతుంది. పొత్తుతో సంబంధం లేకుండా టిడిపి..ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. జనసేనకు భీమవరం, నరసాపురం సీట్లు దక్కే అవకాశం ఉంది. ఇక గూడెం సీటు పొత్తు బట్టి ఉంటుంది. టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ గెలవలేదు. ఒకవేళ పొత్తు లేకపోతే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది.
అయితే భీమవరం, నరసాపురం స్థానాల్లో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అక్కడ జనసేనకు మద్ధతు ఇస్తే..వైసీపీని ఓడించడం సులువు..అలాగే భారీ మెజారిటీలు వస్తాయి. ఇక పాలకొల్లు,ఉండి సీట్లలో జనసేనకు ఓటింగ్ ఉంది కానీ..ఆ సీట్లలో టిడిపికి బలం ఎక్కువ. కాబట్టి పొత్తు లేకపోయినా గెలుస్తుంది. పొత్తు ఉంటే భారీ మెజారిటీలు వస్తాయి.
ఆచంట, తణుకుల్లో జనసేన ఓటు బ్యాంకు ఉంది. కాకపోతే ఈ సీట్లలో టిడిపికి బలం ఎక్కువ. పొత్తు ఉంటే ఈ రెండు సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమే. మొత్తం మీద నరసాపురంలో వైసీపీ జీరో అయ్యేలా ఉంది.