టీటీడీ బోర్డు చైర్మన్ పదవి భూమన కి ఇవ్వడం పై పెను దుమారమే రేగుతోంది. తిరుపతి దేవస్థానం అంటే హిందువులకి స్వర్గధామం. అలాంటి చోట వేరే మతాలని పాటిస్తున్న వ్యక్తికీ టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ పదవి హిందువులకే ఇవ్వాలని, వైసీపీ కి చెందిన వేరే నాయకులకి ఇవ్వాలని అన్ని వైపులా నుండి డిమాండ్స్ వస్తున్నాయి. అయితే ఆ డిమాండ్స్ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగివస్తారా లేదంటే తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా అనేది చూడాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్గా తిరుపతి వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి రెండోసారి నియమితులయ్యారు.2006 నుంచి 2008 వరకు ఆ పదవిలో పనిచేసిన కరుణాకరరెడ్డి ఇప్పుడు వై.వి. సుబ్బారెడ్డి పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. కరుణాకర్ రెడ్డి వచ్చే వారం ప్రమాణస్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని జగన్ మోహన్ రెడ్డి వర్గాలు సూచించాయి. బదులుగా ప్రస్తుతం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్న తన కుమారుడు భూమన అభినయరెడ్డికి పార్టీ టిక్కెట్టు కోరుతున్నట్లు సమాచారం.
కాగా, టీటీడీ అధ్యక్ష పదవికి జంగా కృష్ణమూర్తి, కొలుసు పార్థసారథి, శిద్ధా రాఘవరావు సహా పలువురు పోటీ పడ్డారు. అయితే కరుణాకర్ రెడ్డిని నామినేట్ చేస్తూ ముఖ్యమంత్రి చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
భూమనకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది