అధికార వైసీపీలో జగన్ సిఎం అయితే..సజ్జల రామకృష్ణారెడ్డి షాడో సిఎం అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు తగ్గట్టుగానే సజ్జల వ్యవహారం ఉంటుంది. ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న సజ్జల..అన్నీ రకాల వ్యవహారాల్లో ఉంటారు. ప్రతి శాఖకు సంబంధించిన అంశాల్లో ఈయన జోక్యం ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. పార్టీ పరమైన అంశాల్లో ఈయన ఆధిపత్యం ఎక్కువనే టాక్ ఉంది.
అందుకే పార్టీలో ఈయన నెంబర్ 2 అని అంటారు. ఇలా వైసీపీలో కీలకంగా ఈయన తాజాగా వైసీపీ సీట్లు ఫిక్స్ చేశారు. అది కూడా రాజకీయాలు గరంగా గరంగా ఉండే విజయవాడ పరిధిలో సీట్లు డిసైడ్ చేశారు. నగరం పరిధిలో మూడు సీట్లు ఉన్నాయి. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్ధులని ఖరారు చేశారు. ఈస్ట్ లో దేవినేని అవినాష్, సెంట్రల్ లో మల్లాది విష్ణు, వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ రావు పోటీ చేస్తారని ప్రకటించారు.
మరి ఈ ముగ్గురికి గెలుపు అవకాశాలు ఉన్నాయా? అంటే అదే డౌట్ అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఈస్ట్ టిడిపి గెలిచింది..సెంట్రల్, వెస్ట్ సీట్లు తక్కువ మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఇప్పుడు సెంట్రల్ లో టిడిపి ఆధిక్యంలో ఉంది. అక్కడ వైసీపీ గెలుపు గగనమే. పైగా జనసేన సపోర్ట్ చేస్తే టిడిపికి భారీ మెజారిటీ ఖాయం…పొత్తు లేకపోయిన టిడిపి గెలుపు ఫిక్స్.
ఈస్ట్ లో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఈయనకు ప్రజా మద్ధతు ఉంది. కానీ వైసీపీలో దేవినేని అవినాష్..దూకుడుగా ఉన్నారు. ప్రజలకు అండగా నిలబడుతున్నారు. నియోజకవర్గంలో అన్నీ పనులు చేయిస్తున్నారు. దీని వల్ల గద్దెకు అవినాష్ గట్టి పోటీ ఇస్తారు. అయితే టిడిపి-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి ఎదురుదెబ్బ. వెస్ట్లో అదే పరిస్తితి. టిడిపి-జనసేన కలిస్తే వెల్లంపల్లి గెలవడం కష్టమే.