జనసేన అధినేత పవన్ వారాహి యాత్రతో ప్రజల్లో తిరుగుతున్న విషయం తెలిసిందే. జనసేనని బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. అయితే మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడారు గాని..ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడటం లేదు. ముందు పార్టీని బలోపేతం చేసుకుని ఆ తర్వాత పొత్తుల గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల్లో జనసేనకు బాగా ఓట్లు పడిన స్థానాలపై పవన్ ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలోనే ఆ స్థానాల్లోనే పవన్ వారాహి యాత్ర చేస్తున్నారు. అమలాపురం స్థానంలో కూడా పవన్ యాత్ర ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ కూడా జనసేనకు భారీగా ఓట్లు పడ్డాయి. అమలాపురం అసెంబ్లీలో వైసీపీకి 72 వేల ఓట్లు పడగా, టిడిపికి 46 వేలు, జనసేనకు 45 వేలు ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే అప్పుడే వైసీపీ గెలిచేది కాదు. ఇప్పుడు రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. దీంతో వైసీపీ గెలవడం కష్టమే.
అదే సమయంలో పొత్తు లేకపోతే మూడు పార్టీల మధ్య పోరు జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ బలం తగ్గింది. అటు టిడిపి, జనసేన పుంజుకున్నాయి. దీంతో మూడు పార్టీల మధ్య పోరు జరగడం ఖాయం. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్తితి. పొత్తు ఉంటే మాత్రం వైసీపీకి ఓటమే. కాకపోతే పొత్తులో ఈ సీటు టిడిపికి దక్కుతుందా, లేదా జనసేనకు దక్కుతుందా? అనేది క్లారిటీ లేదు.
అయితే పొత్తు ఉంటే ఈ సీటు జనసేన తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే పవన్ సైతం ప్రత్యేకంగా జనసేనకు పట్టున్న స్థానాల్లోనే పర్యటిస్తున్నారు. టిడిపి, జనసేన కలిస్తే మాత్రం అమలాపురం సొంతం అవుతుంది. కానీ చివరికి సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.