కాపు సామాజికవర్గానికి ఒక ఐకానిక్ హీరో అంటే వంగవీటి రంగా. ఆయనకు కాపు వర్గంలో ఉన్న ఫాలోయింగ్ ఎలాటిదో చెప్పాల్సిన పని లేదు. ఇక రంగా తర్వాత రాధా..కాపు వర్గానికి అండగా ఉంటూ వెళుతున్నారు. అయితే ఆయన..కాపు వర్గమే కాదు..అన్నీ వర్గాలకు సపోర్ట్ గానే ఉంటున్నారు. రంగా అందరి మనిషి అని చెబుతూ వస్తున్నారు. అయితే రంగా రాజకీయంగా సక్సెస్ అయిన రాధా ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు.
2004లో రాధా రాజకీయాల్లోకి వచ్చారు…2004లో కాంగ్రెస్ తరుపున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు..2009లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ప్రజారాజ్యంలో ఓడిపోయారు.2014లో వైసీపీ నుంచి తూర్పులో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో ప్రాధాన్యత లేకపోవడం..తన తండ్రి రంగా విగ్రహావిష్కరణలకు వెళ్లడానికి కూడా ఆంక్షలు ఉండటంతో ఆయన..2019 ఎన్నికల ముందు వైసీపీని వదిలి టిడిపిలోకి వచ్చారు. 2019లో పోటీ చేయలేదు..కానీ టిడిపి కోసం ప్రచారం చేశారు.
తర్వాత టిడిపి ఓడిపోయాక రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు..కానీ తన రంగా ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడంలో బిజీగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు టిడిపిలో కనిపిస్తూ వచ్చారు. లోకేష్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పటికీ ఆయన టిడిపిలోనే ఉన్నారు. కానీ ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో ఏ సీటులో పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.
విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ ఉన్నారు. సెంట్రల్ లో బోండా ఉమా ఉన్నారు. వెస్ట్ లో పోటీ ఎక్కువ. మరి రాధాని ఎక్కడ నుంచి బరిలో ఉంచుతారు అనేది క్లారిటీ లేదు. బందరు ఎంపీగా పంపుతారా? అనేది తెలియడం లేదు. పైగా రంగా వారసురాలు, రాధా సోదరి ఆశ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారనే టాక్ వస్తుంది. ఆమె ఏ పార్టీలోకి వెళ్తారనేది తెలియడంలేదు. చూడాలి మరి చివరికి రాధా ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో.