ఉండవల్లి అరుణ్ కుమార్ పరిచయమే అక్కర్లేని పేరు. సీనియర్ రాజకీయ నాయకుడు, విశ్లేషకుడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా సమస్యలపై విమర్శనాస్త్రాలు సంధించడం లో ఉండవల్లి కి పోటీ లేరు అని చెప్పవచ్చు. కానీ రాజకీయ విశ్లేషకుడు ముసుగులో టిడిపిపై విషం జల్లడం…జగన్కు అనుకూలంగా మాట్లాడటం ఉండవల్లి నైజం. అయితే కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్న ఉండవల్లి ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోర్టులో కేసు వేయడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సంబంధమే లేదని , అరెస్టు అక్రమమని అందరూ వాదిస్తుంటే ఆ కేసు పై సీబీఐ విచారణ అంటూ కేసు వేసిన ఉండవల్లిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్, ఉండవల్లి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని సంగతి చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూపిస్తూ, విశ్లేషణలు చేస్తూ ప్రజలకు వివరించిన ఉండవల్లి, ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ జగన్ ప్రభుత్వంలో ఎన్ని తప్పులు జరుగుతున్నా, ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఉండవల్లి అవసరానికి అనుగుణంగా రంగులు మార్చే ఊసరవెల్లి వంటి వారిని టిడిపి నాయకులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మూడు రాజధానుల గురించి గానీ, మద్యంలో అక్రమాలు, గంజాయి అక్రమ రవాణా గురించి గానీ, కత్తిపూడి అటవీ ప్రాంతంలో కలిగి సంపద తరలింపు గురించి కానీ, అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన గురించి గానీ, ఇసుక అక్రమ రవాణా గురించి గానీ, రాజానగరం ఆవ భూముల కుంభకోణం గురించి గానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి గానీ ఉండవల్లి ప్రశ్నించలేదు. ఈ సమస్యలన్నీ ఉండవల్లికి కనిపించలేదా?? కనిపించినా జగన్ తో చేతులు కలిపి చూసి చూడనట్లు ఉంటున్నారా?
ఎంతో అనుభవం ఉన్న ఉండవల్లి రాష్ట్ర అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలి గాని, అరాచకాలకు, అక్రమాలకు కొమ్ముకాస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసే జగన్ వంటి వ్యక్తి చేతిలో పావుగా మారకూడదని రాజకీయ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందైనా ఉండవల్లి ఊసరవెల్లి కాదు అని నిరూపించుకుంటారా ???లేక జగన్మోహనుడి ఆటలో పాములా మారతారా?? వేచి చూడాల్సిందే.