వైసిపి ప్రభుత్వం వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళుతుంది. 175 సీట్లు సాధించటం అసాధ్యమని జగన్ తో సహా అందరికీ తెలుసు, కానీ జగన్ ధీమా ఏమిటా అని రాజకీయ విశ్లేషణలు ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా వైసిపి ప్రభుత్వం కల్పించినవే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత మర్చిపోవడం, నిరుద్యోగులను, ఉద్యోగులను, సామాన్య ప్రజలను అందరినీ వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని వ్యతిరేకత ప్రజలలో చాలా ఉంది.
ఆ విషయం వైసిపి అధినేతకు, వైసిపి నాయకులకు, క్యాడర్ అందరికీ తెలుసు. కానీ 175 సీట్లు సాధిస్తాము, సాధించాలి అని జగన్ అంటుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్ వ్యూహాలతో టిడిపిని అష్టదిగ్బంధం చేశారని రాజకీయ వర్గాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో జగన్ టిడిపిని కోలుకోవాలని దెబ్బతీశారని చెప్పవచ్చు. చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత టిడిపికి సానుభూతి వచ్చింది. ఆ సానుభూతితో ఈసారి కచ్చితంగా గెలుస్తామని టిడిపి నాయకులు అనుకుంటున్నారు.
అది వాస్తవమే కానీ ఎన్నికల్లో గెలుపు కోసం టిడిపి వారు ఒక్క కార్యక్రమం కూడా చేయడం లేదు. లోకేష్ చేస్తున్న యువ గళం పాదయాత్రను చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆపారు. కానీ ఇప్పటివరకు మళ్ళీ మొదలుపెట్టలేదు. టిడిపిని ప్రజలకు చేరువ చేసేలా రూపొందించిన కార్యక్రమాలలో ఒక్కటి కూడా ఇప్పుడు ఎవరూ చేయడం లేదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే భువనేశ్వరి గాని, బ్రాహ్మణి గాని, బాలకృష్ణ గాని, ఎవరైనా సీనియర్ గాని టిడిపిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకుని ప్రజల ముందుకు వెళితే కచ్చితంగా టిడిపినే గెలుస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నారు.
వైసీపీ మాత్రం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఐప్యాక్ అంటూ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. కార్యకర్తలు అందుబాటులో లేకపోయినా ఐప్యాక్ వారితో ఎన్నికలను నడిపించగల సత్తా వైసీపీకి ఉంది. సొంతంగా సోషల్ మీడియాలోనూ, పేపర్ ఛానల్లోనూ అధికార పార్టీ గురించి ప్రజలకు గొప్పగా చూపిస్తున్నారు. అందుకే జగన్ వై నాట్ 175 అంటూ ప్రజలకు ముందుకు వెళుతున్నారు.
ఇప్పటికైనా టిడిపి మేల్కొని ఎన్నికల కార్యాచరణ ప్రారంభించకపోతే వైసిపి కుట్రలని ఆపడం ఎవరి తరం కాదని విశ్లేషకులు అంటున్నారు.
ReplyReply allForward |