ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జి లతో జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో వై నాట్ 175, ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదాలతో ప్రజలలోకి వెళ్లాలని చెబుతున్నారు. కానీ అది అసాధ్యమని జగన్ కు తెలుసు కార్యకర్తలకు తెలుసు.
వై నాట్ 175 అనే నినాదం కుప్పం మున్సిపాలిటీలో వైసిపి గెలిచిన దగ్గర నుండి జగన్ ఈ నినాదాన్ని తీసుకువచ్చారు. కుప్పంలో మున్సిపాలిటీ గెలుపును చూసి జగన్ ఏపీలో 175 స్థానాలు గెలవచ్చు అని అంటున్నారు. వైసిపి 175 గెలవడం అంటే అతిశయోక్తి అన్నది జగమెరిగిన సత్యం. కుప్పంలో వైసిపి మున్సిపాలిటీ గెలిచింది ఇది అధికారంతో వచ్చిన గెలుపు మాత్రమే కానీ స్వతహాగా ఇక్కడ వైసిపికి స్థానం లేదు.
కుప్పం వైసిపిలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ భరత్, సెంథిల్ కుమార్ వర్గం, మరో రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పెద్దలతో కలిసి ఉన్నారు. కుప్పంలో గెలుపు అనే వాపును చూసి బలం అని వైసిపి నాయకులు భ్రమ పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .
కుప్పం లాంటి టిడిపి కంచుకోటలో వైసీపీ వర్గ పోరుతో సతమతం అవుతుంది. కుప్పం లాగా వైసీపీలో వర్గ పోరు ఉన్న నియోజకవర్గాలు రాయలసీమ జిల్లాలో కోకొల్లలు. ఈ వర్గ పోరుతో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి కుప్పంలో వైసీపీ గెలుపు అనేది అసాధ్యం..అదే సమయంలో ఈ సారి సీమలో వైసీపీకి భారీగా దెబ్బతగలనుంది.
ReplyReply allForward |