జగన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే..అది ప్రజలకు మేలుయి చేయడం కంటే..దానికి వెనుక రాజకీయ కోణం ఎక్కువ ఉంటుంది..అంటే అది వైసీపీకి మేలు…టిడిపికి నష్టం చేసేది అన్నట్లుగా. అలాంటి నిర్ణయాలు అధికారంలోకి వచ్చాక చాలానే తీసుకున్నారు..వాటిల్లో ఒకటి మూడు రాజధానులు..మూడు ఉంటే మూడు ప్రాంతాల్లో అభివృద్ధి అనే మాట చెప్పారు. రాజధాని ఒక చోట ఉంటూ..అన్నిచోట్ల అభివృధ్ది చేయవచ్చు అనేది ప్రజలకు తెలియదన్నట్లే చెప్పారు.
ఈ నిర్ణయంతో అమరావతిని దెబ్బతీయడం..రాజకీయంగా అటు రాయలసీమ,ఇటు ఉత్తరాంధ్రలో టిడిపిని దెబ్బతీసి వైసీపీ లబ్ది పొందడం. కానీ అదేం జరగలేదు..ఎంత రాజకీయం చేసిన, కుట్రలు చేసిన వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఈ మూడు వైసీపీకే రివర్స్ కొట్టాయి. ముఖ్యంగా విశాఖ పరిపాలన రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో వైసీపీ చేసిన రాజకీయం అందరికీ తెలుసు. అయితే అభివృద్ధి చేయకుండా, భూ కబ్జాలు, అక్రమాలు చేయడం ఎక్కువైంది. కొత్త కంపెనీలు రావడం లేదు. అలాగే ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో ఇప్పుడు పరిస్తితులు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి.
అందుకే అక్కడి ప్రజలు వైసీపీకి యాంటీగా మారిపోయారు. జగన్ కాపురం పెడతానని చెబుతున్నా నమ్మడం లేదు..గతంలో లూలూ సంస్థని తరిమేసి..ఇప్పుడు రహేజా వాళ్ళతో మాల్ కడతానని చెబుతున్నా నమ్మడం లేదు. అసలు టోటల్ గా వైసీపీకి రివర్స్ అయింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా దెబ్బ వేస్తుంది.
మొత్తానికి ఉత్తరాంధ్రలో వైసీపీకి సీన్ రివర్స్ అవుతుంది. 2024 ఎన్నికల్లో చావు దెబ్బ తినేలా ఉంది. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలో 15 సీట్లకు వైసీపీ 11 గెలుచుకుంది..ఇప్పుడు 5 సీట్లు వచ్చిన గొప్పే అన్నట్లు పరిస్తితి ఉంది. విజయనగరంలో 9 సీట్లు స్వీప్ చేసింది..అక్కడ 3 సీట్లు కూడా డౌటే. శ్రీకాకుళంలో 10కి 8 గెలుచుకుంది..ఇప్పుడు 4 సీట్లు కూడా డౌటే..ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ తగలనుంది.