జనసేన అధినేత పవన్ కల్యాణ్ని వైసీపీ కావాలని టార్గెట్ చేసి పైకి లేపుతుందా? పవన్ బలం పెంచి..టిడిపిని దెబ్బతీయాలని చూస్తున్నారా? అంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లు పోరు నడుస్తుంది. మధ్యలో పవన్..వాలంటీర్లని టార్గెట్ చేయడం..రాజకీయం మరింత వేడెక్కడం జరిగింది. ఈ వార్ లో టిడిపి కనిపించలేదు.
మీడియా కూడా ఈ రెండు పార్టీల పోలిటికల్ యుద్ధాన్ని ఎక్కువ కవర్ చేశాయి. ఇక ప్రజాదరణ దూసుకెళుతున్న లోకేష్ పాదయాత్రకు మీడియా కవరేజ్ తక్కువగానే ఉంది. ఈ పరిణామాలని చూస్తుంటే పవన్ని వైసీపీనే పైకి లేపుతుందా? అనే డౌట్ వస్తుంది. దీని లో మూడు కోణాలు ఉన్నాయి. ఒకటి వైసీపీ వ్యతిరేక ఓట్లని టిడిపి-జనసేనలు చీల్చుకునే చేసి..మళ్ళీ వైసీపీ లబ్ది పొందడం. ఈ అంశం పొత్తు లేకపోతే. ఇక పొత్తు ఉంటే..పవన్ ఇంకా తమ బలం పెరిగిందని చెప్పి..టిడిపిని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం..అవసరమైతే సిఎం సీటు అంశం కూడా..దానికి టిడిపి ఒప్పుకోదు. దీంతో పొత్తు చెడిపోతుంది. ఇది వైసీపీకి ప్లస్సే.
ఇంకా మూడో అంశం..టిడిపి-జనసేన పొత్తు కుదిరిన..ఒకవేళ జనసేన కొన్ని సీట్లు అదనంగా తీసుకున్న..అప్పుడు ఆయా స్థానాల్లో టిడిపి ఓట్లు జనసేనకు బదిలీ కావు. దీని వల్ల పొత్తుకు నష్టమే. పైగా పొత్తులో బిజేపి అంటున్నారు..ఆ పార్టీకి ఓట్లు బదలాయింపు జరగడం కష్టమే. ఈ పరిణామాలతో చివరికి టిడిపి నష్టం చేసి మళ్ళీ గెలవాలనేది వైసీపీ ప్లాన్ అని అనుమానాలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు ఏ అంశాన్ని తక్కువ గా తీసుకోరు..కాబట్టి ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.